తెలుగు సినిమా వజ్రోత్సవాలు ధాటిగా ప్రారంభమై వాగ్ధాటిగా ముగిసాయి. ఈ హడావిడిలో కొన్ని నిజాలు తెలిసాయి. నటీ నటుల నిజమైన హీరోయిజం అర్ధమయింది.
ఈ వజ్రోత్సవాలలో హీరోగా నిలచి అందరి మనసులు కొల్ల గొట్టిన వాడు ఒకే ఒక్కడు...
ఆశ్చర్యంగా ఉన్నా అది...బాలకృష్ణ
హుందాతనం, చెరగని చిరునవ్వు, పెద్దలంటే గౌరవం, చిన్న పెద్ద తారతమ్యం లేకపోవటం , కొట్టొచ్చిన అమాయకత్వం, బోళాతనం అందరిని ఆకట్టుకున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో రాజకీయాలకు పూర్తిగా అతీతంగా కనిపించాడు.
నేను ముందర బాలకృష్ణ అంటే చాలా తేలిగ్గా తీసి పడేసే వాడిని. (సినిమాల వలన).కానీ బాలకృష్ణ నిజ జీవితంలో పూర్తిగా తేడా ఉందనిపించింది. నాకు ఇవన్నీ చూస్తే అలనాటి విమాన ప్రమాదం ఒక్క సారి గుర్తుకొచ్చింది. చిరంజీవి భోరున ఏడుస్తూ పొలాల నుంచి బయటకు వస్తే, ఒక్క బాలకృష్ణ మాత్రం చాలా స్థిమితంగా, ప్రశాంతంగా బయటకు నడుచుకు వచ్చేసాడు.
ఇక జీరోలు
౦౧. ఖచ్చితంగా ఈ ఉత్సవాల కమిటి. ఖర్చు పెట్టిన డబ్బంతా ఎక్కడ పోయిందో అర్ధం కాలేదు. విమానం ఛార్జీలు చెల్లించి మరీ ముంబయి హీరోయిన్లను రప్పించారో ఏంటో? దిగ్గజాలన్నారు...బతికున్న మహామహులను మర్చిపోయారు. చనిపోయిన మహా నటుల కుటుంబాలను ఆహ్వానించి వారికి ఇవ్వొచ్చుగా దిగ్గజాల అవార్డులు? అలా అయితే ఖచ్చితంగా ఇప్పటి తరం నటులు మొదటి 75 దిగ్గజాలలో ఉండరు. రంగస్థలం మీద కనీసం సినీ మహామహుల చిత్రాలు లేవు. కార్యక్రమాలన్నీ ముంబాయి భామలు, చెన్నై భామల చేతుల మీదగానే. శ్రీదేవి(ఇప్పటి), సుహాసిని(ఇప్పటి) వంటి తెలుగు తారలు నృత్యాలకే పరిమితం.పురుషాధిక్యత సుస్ప్రష్టం. శ్రీదేవి(సీనియర్) వంటి సినీ దిగ్గజం అసలు హాజరు కాలేదు. చిరంజీవి పద్మ భూషణ్ సత్కారానికి ఇంతకంటే బాగనే తెలుగు హీరోయిన్లు వచ్చారేమో.
౦౨. మోహన్ బాబు : చెప్పేదంతా నిజమే అనిపించినా చెప్పిన విధానం చాలా చవకబారుగా ఉంది. నేను గొప్ప అని చెప్పుకోవటం గొప్పవాళ్ళ లక్షణం అసలు కాదు. చెప్పిన కారణాలు కూడా కొద్దిగా అతడు ఆలోచించుకుని చెప్పాలి. ఎందుకంటే ఒక విద్యా సంస్థను స్థాపించటం గొప్ప కాదు...అందులో 25% ఉచిత విద్య మరీ అంత గొప్ప విషయం కాదు. పూర్తిగా ఉచితంగా వైద్యం చేసే వైదులు, చదువు చెప్పే టీచర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక రాజ్య సభకు ఎంపిక కావటం. అతను ఆ సభకు ఎలా వెళ్ళాడు? రాజ్య సభ అంటే ఒకొప్పుడు మేధావుల సభ.ఇప్పుడు అది ఒక రాజకీయ పునరావాస సభ. అందువలన వాటిని ప్రాతిపదికగా తీసుకుని సినీ దిగ్గజం అంటారనుకుంటే టొమేటో పప్పులో కాలు వేసినట్లే.ఇతడికి అస్సలు క్రమశిక్షణ లేదు. ఒక నలభై నిమిషాలు తినేసాడు (నాలుగు నిమిషాల ప్రసంగం చెయ్యబోయి).
౦౩. ఇక చిరంజీవి....మొదలు పెట్టటమే ఉబికి వస్తున్న కన్నీళ్ళతో మొదలు పెట్టాడు. చెప్పేది మోహన్ బాబును ఉద్దేశించి అయినా ముందర మోహన్ బాబు సభలో ఉన్నాడో, లేనిదీ ఒక సారి టెస్ట్ చేసి (ఏడీ మోహన్ బాబు...) మరీ మొదలు పెట్టాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కాదు ..నేనే అనిపించాడు, క్లాస్ గానే మాట్లాడుతూ డ్రామా రక్తి కట్టించాడు. ఇతడు చెప్పిన దానికి చేస్తున్న దానికి ఒక విషయంలో పొంతన కుదరలేదు. ఒకప్పుడు దర్శకులు పిలిచి వేషం ఇస్తే ఎంతో సంతోషంగా చేసేవాళ్ళం, ఒదిగి ఉండే వాళ్ళం...ఇప్పుడూ అలానే ఉందాం..అర్ధాకలితో ఉందాం అన్నాడు. అయితే ఆ ప్రసంగానికి ఒక రోజు ముందరే పూరీ జగన్నాధ్ సుమతో "చిరంజీవి గారికి నాలుగు కధలు వినిపించా, కానీ అతనికి నచ్చలేదు" అని చెప్పాడు. ఇప్పుడు తెలుగులో ఉన్న దుస్థుతి ఇది. ఇదే కారణం మీద రామ్ గోపాల్ వర్మ చిరంజీవితో సినిమాకు గుడ్ బై చెప్పేసాడు. మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమనే తన్ని పోయాడు. ముఖ్యమంత్రి చేతుల మీదగా ఇచ్చిన అవార్డును తిరస్కరించి చాలా తప్పు చేసాడు. అది ముఖ్యమంత్రికే అవమానం. అది చాలక డ్రామా సహితంగా టైమ్ కాప్స్యూల్ లో వెయ్యటం ఒకటి. ఆ పెట్టెలో ఏమి వెయ్యవచ్చో అల్లు అరవింద్ పది సార్లు చెప్పినా కూడా చిరంజీవి ఆ పని చెయ్యటం ద్వారా ఈ అవమానకర సంఘటనను తరువాత ఇరవై అయిదు సంవత్సరాలకు, ప్రతిష్టాత్మకమైన శత వత్సర పండుగ వరకు పొడిగించారు. అప్పటికి చిరంజీవి, మోహన్ బాబు స్నేహితులుగా చెట్టా పట్టాలు వేసుకుని ఉంటే వారికి ఆ శత వత్సర పండుగలో వారు చేసిన పనులు చాలా చెత్తగా అనిపించక మానవు. ఎప్పుడూ ఆదర్శంగా
మాట్లాడే చిరంజీవి ఇలా ప్రవర్తించటం అసలు ఊహించనిది.
౦౪. దాసరి : శకుని పాత్ర అంటున్నారు.
౦౫. పవన్ కల్యాణ్ : అస్సలు మెచ్యూరీటీ లేదు. తప్పనిరిగా మానసిక వైద్యం అవసరం. నాకుండే గౌరవం పోయింది.