Wednesday, March 29, 2006

కొన్ని రోత పుట్టించే నిజాలు

మన రాజశేఖరుడికి సోనియా ఇటాలియన్ త్యాగాల (???)ముందు ఎవ్వరూ కనిపించటం లేదులా వుంది. మెదక్ లో రైతులు టొమాటో పంటను రోడ్లపైనే పడేసి పోయారంట. 250 కి.మీ దూరం లో వున్న భాగ్యనగరం లో అవి కిలో 7 రూ పలుకుతున్నాయి. ఇంత కంటే సిగ్గు చేటు మరొకటి లేదు. దీనికి కూడా గత ప్రభుత్వమే కారణం అంటారేమో మన రోసయ్య గారు(వారి అల్లుడు గారి చెత్త ప్రవర్తన కి కూడ అదే కారణం మరి).

రక్తాలు చూస్తామన్న రాజకీయ నాయకులను, హత్యలు చేసె ఫ్యాక్షనిస్ట్లను మనం ఎమి చెయ్యలెము గాని, మూలన కూర్చుని కలం తో ధైర్యంగా మాట్లాడే రచయతలను మాత్రం కారగారం లో పెడతాం. ఎందుకంటే వారు మనం ముద్దుగా చూసుకునే మైనారిటీలు కారు, బలహీన వర్గాలమని చెప్పుకోరు. కులం అనే వ్యవస్ఠని అసహ్యించుకుంటారు. ఏ ఓటు బ్యాంకును ప్రభావితం చెయ్యలేరు. ఇంకెవడికి కావాలి వీళ్ళు? అందుకే ప్రతిపక్షం కూడ మూగబోయింది.

అసలు సమీకరణం ఏంటి అంటే :

జనం --> కులం/మతం --> ఓట్లు --> అధికారం --> కాంట్రాక్టులు --> డబ్బు

పిచ్చిగా స్వరాష్ట్రాల కోసం కుస్తీ పడుతున్న వాళ్ళు ఒక్క విషయం తెలుసు కోవాలి, మీరు కులం/మతం స్థానం లో భూమి ని పెట్టాలనుకున్న అది పని చేస్తుందనే నమ్మకం లేదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకు భూమి మీద అంత మమకారం, భావ ఉద్వేగాలు ఉన్నయంటారా?

2 comments:

chanukya said...

cha la baagundhi!idhi ceppandi mundhu,net lo telugu lipi lo vrayadam ela?

Sudhakar said...

నేను వీవెన్ గారి లేఖిని వాడుతానండి
http://veeven.org/lekhini

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name