Friday, December 28, 2007

గూగులు తెలుగు

గూగుల్ భారతీయ భాషలపై చాలా సీరియస్ గానే దృష్టి పెట్టింది. భారతీయ మార్కెట్ ను సొమ్ము చేసుకోవాలంటే వారి భాషలోనే ప్రయత్నించాలనే ప్రధమ సూత్రాన్ని తొందరగా వంటపట్టించుకుంది. మన దేశంలో పిచ్చి పిచ్చిగా కుర్ర జనం వాడే ఓర్కుట్ తోనే అది శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఓర్కుట్లో హాయిగా తెలుగులో స్క్రాప్ లు రాసుకోవచ్చు. దీనికి RTS రానక్కరలేదు. తెలుగును ఆంగ్లంలో రాసుకుంటూ పోవడమే.

orkut_telugu

ఇప్పుడు మూలనున్న ముసలమ్మలు కూడ ఓర్కుట్లోకి దూకుతారనడంలో ఆశ్చర్యం లేదు.

Thursday, December 27, 2007

మానవత్వం మతంతో మరో సారి ఓడింది

పోయిన చోటే వెతుక్కోమని ఎవడు చెప్పాడో గానీ, అది పాకిస్తాన్ లాంటి మతమౌఢ్యపు నాయకులున్న రాజ్యంలో పనికి రాదని తెలుసుకోవాలి. తివిరి ఇనుమున తైలమ్ము తీయవచ్చేమో గానీ ఈ దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం ఒక్క చుక్క కూడా పిండలేం.

ముదనష్టపు బుష్షు గాడు ఏమంటాడో మరి. వాడికసలే జనరల్ బుషారఫ్ అంటే తెగ మోజు.

Wednesday, December 26, 2007

మరిచిపోయిన మధురగీతం

ఎందుకో గానీ ఈ మధుర గీతం చాలా మందికి తెలియదు. గానీ ఈ పాట నేను సంవత్సరానికి ఒక్క సారైనా విని తీరుతాను. ఎమ్.యస్ రామారావు గారి అతి మధురమైన, అదో రకమైన మత్తుతో వుండే గొంతుతో పాడిన లాలి పాటలా వుండే ఈ పాట మీరూ వినండి మరి.

చిమట సంగీత ప్రపంచపు లంకెలో చివరి పాటను వినండి.

ఈ పాటకు మధురమైన సంగీతాన్ని ఓపీ నయ్యర్ జీ అందించారు.

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో...

నిదురించు జహాపనా -  ||

పండు వెన్నెల్లో వెండి కొండల్లే

తాజ్ మహల్ ధవళా కాంతుల్లో ||

నిదురించు జహాపనా - ౨

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో

నిదురించు జహాపనా -  ||

నీ జీవిత జ్యోతీ నీ మధుర మూర్తి - ౨

ముంతాజ్ సతీ సమాధి

సమీపాన నిదురించు - ౨

జహాపనా...

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో

నిదురించు జహాపనా -  ||

Monday, December 17, 2007

వింటర్ విస్టా : ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన కూర

ఇక్కడ రాస్తున్న కూర చాలా జాగ్రత్తగా చెయ్యాల్సిన కూర. ఒక విప్లవాత్మకమైన కూర. చెయ్యటానికి విశాల దృక్ఫదం వుండాలి. ముఖ్యంగా సహనం వుండాలి. ఇది నేను సొంతంగా తయారుచేసిన, పేరు పెట్టిన కూర. తయారు చేసి మీ తిట్లు వ్యాఖ్యలుగా రాయవచ్చు. కూర మొత్తం చేసాక ఈ కూరకు ఈ పేరు ఎందుకు పెట్టానో అర్ధం అవుతుంది. ఇది చాలా తక్కువ కాలరీలు కలిగే ఆరోగ్యకరమైన కూర.

కావలసిన దినుసులు

ఎర్రని కారట్ దుంపలు - నాలుగు

ఉల్లిపాయలు - రెండు

కాలీ పువ్వు రెమ్మలు - పది

పచ్చ్ఝ బఠానీలు - వంద గ్రాములు

గుడ్లు - రెండు

బంగాళా దుంప - ఒకటి (చిన్నది)

కార్న్ పిండి - వంద గ్రాములు

టొమేటోలు - మూడు (పెద్దవి, బాగా పండినవి)

పచ్చి మిరప - ఐదు కాయలు

ఆలివ్ ఆయిల్ - ఒక టీ స్పూన్

కార్న్ ఆయిల్ - మూడు టీ స్పూనులు

జీలకర్ర - ఒక స్పూను

మిరియాలు - పది

ముందుగా గుడ్లు, బంగాళా దుంప బాగా ఉడకబెట్టి పక్కన పెట్టాలి. గుడ్లు ఒలిచి మధ్యలో వుండే పచ్చని భాగాన్ని తీసుకుని, తొక్క తీసిన బంగాళాదుంపతో కలపి మిక్సీలో వేసి బాగా ముద్దగా చేసి ఒక గిన్నెలో ఉంచుకోవాలి.

పచ్చ బఠానీలు, కాలీ పువ్వు రెమ్మలు, క్యారట్లు, జీలకర్ర, మిరియాలు, ఉల్లిపాయలు (ముక్కలు కావు) కలిపి కుక్కర్లో వేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి, రెండు కప్పుల నీరు పోసి మూత పెట్టి మూడు కూతలు వచ్చే వరకూ వుంచి దింపెయ్యాలి.

కొంత సేపయ్యాక కుక్కరు మూత తీసి కూరగాయల నీటిని ఒక పాత్రలో సేకరించాలి.ఈ నీరు చాలా ముఖ్యం.

ఉడికిన కూరగాయలు పక్కన పెట్టి, ఉడికిన క్యారట్లు తీసుకుని నిలువుగా చీల్చాలి. ఇలా చీల్చిన వాటిని కార్న్ ప్లోర్, జీలకర్ర పొడి కలపిన ద్రావకంలో ముంచి నూనెలో బాగా వేపి ప్రక్కన పెట్టుకోవాలి.

ఒక బాణలి తీసుకుని కొద్దిగా కార్న్ నూనె వేసి, అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, కొన్ని తరిగిన ఉల్లిపాయలు వేసి పోపు వెయ్యాలి.

దానిలో ఉడికిన కూరగాయలన్నీ వేసి బాగా కలిపి కొద్దిగా మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వటం మొదలుపెట్టాలి.

పక్కన పెట్టుకున్న కూరగాయల నీటిలో గుడ్ల, బంగాళా దుంపల పేస్టుని కలిపి బాగా బీట్ చెయ్యాలి. దీనిలో కొద్దిగా కార్న్ పిండిని కొద్దిగా కలుపుకోవచ్చు.

ఇప్పుడు ఉడుకుతున్న కూరలో, మెల్లగా ఈ నీటిని కలిపి బాగా కలిపి అలానే ఒక పదిహేను నిమిషాలు ఉడకపెట్టి (ఉప్పు తగినంత కలిపి) బాగా కూర చిక్కబడిన తరువాత దింపాలి.

ఇప్పుడు దానిపై బాగా తరిగిన కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే వింటర్ విస్టా కర్రీ రెడీ.

మీ విజిటింగ్ కార్డుపై అందమైన క్యాలండరు

మనం చాలా మంది విజిటింగ్ కార్డులు అచ్చు వేయిస్తుంటాం. కానీ మనం ఇచ్చిన ముక్కలు వెనక్కి తిరిగేలోపు పర్సులో ఓ మూలకు పోతాయి. అలా కాకుండా సంవత్సరమంతా మన ముక్కనే మరీ మరీ వాడుకునే విధంగా చెయ్యాలంటే క్రింద చూపిన విధంగా ఒక అందమైన క్యాలండరు వెనుక ముద్రిస్తే సరి :-)



ఇక దీనిని వాడటం చాలా సులువు. ఏ నెల చూడాలో అది మాత్రమే కనిపించేటట్లు ఈ కార్డుని వేళ్ళతో పట్టుకుంటే సరి.


మీకు ఇంకా మిగతా సైజులు కావాలంటే ఇక్కడి నుంచి తెచ్చుకోండి.

ThumbCalendar

Sunday, December 09, 2007

ఏమిటీ చిరు భజన?

ఎవరేమనుకున్నా మన ఆంధ్రులకు ఒక చెత్త గుణం వుంది. అదేమిటంటే మాస్ హిస్టీరియా గుణం. ఎవడో ఏదో మొదలుపెట్టడం, దానికి అసలు ఆలోచనే లేకుండా చెక్క భజన గుడ్డిగా చెయ్యటం మనకు మామూలయ్యింది. దీనికి తోడుగా ఇప్పటి పార్టీలు కూడా తయారయ్యాయి. ఇది చాలా ప్రమాదకరం.

టాటా టీ వారి ఒక ప్రకటన ఇప్పుడు వస్తూ వుంది. అందులో వోట్లు అడగటానికి వచ్చిన రాజకీయ నాయకుడికి టీ తాగమని చెప్పి అతని పరిపాలనా దక్షత గురించి ఒక యువకుడు అడుగుతాడు. దానికి ఆ నాయకుడు హేళనగా నవ్వి నన్ను ఇంటర్వూ చేస్తున్నావా? ఏ ఉద్యోగానికి అని అడుగుతాడు. దానికి ఆ యువకుడి ఈ దేశాన్ని పాలించే ఉద్యోగం అని కళ్ళు తెరుచుకునే సమాధానం ఇస్తాడు. అవును ఈ దేశంలో అత్యంత క్లిష్టమైన, అత్యంత దక్షత కావాల్సిన ఉద్యోగం "నాయకుడు". ఈ నిజం జనాలు మరిచిపోయే విధంగా మన నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తూ వుంటారు. ఆ నిజం మన దేశ పౌరుల నరనరాల జీర్ణించుకున్న మరుక్షణం దేశం బాగు పడటం మొదలవుతుంది.

చిరంజీవి తెలుగు ప్రజలు గర్వించే నటుడిగా అందరికి తెలుసు. నాకు చాలా నచ్చే నటులలో చిరు ఒకరు. ఒక మనిషిగా కూడా. అయితే అవి సినిమాలకే పరిమితం. అతని ప్రమేయం లేకుండా, అతని అభిప్రాయం తెలుసుకోకుండా ఈ చిరు భజన ఏమిటో అర్ధం కావటం లేదు. స్వతహాగా చిరంజీవిలో నాకు నాయకత్వ లక్షణాలు అంతగా కనిపించవు. చాలా సున్నిత మనస్కుడుగా అనిపిస్తాడు. అది చాలా విషయాలలో బాహాటంగా తెలిసిన విషయమే. అయితే ఒక మంచి మనిషిగా చిరంజీవి చాలా పనులు చెయ్యటం అనేది కేవలం అతని వ్యక్తిగత స్వభావం, నిర్ణయము మాత్రమే అని తీసుకోకుండా దానిని రాజకీయం చెయ్యటం మన రాష్ట్రానికే చెల్లింది. నిజానికి మన దేశంలో, రాష్ట్రంలో ఇంతకంటే చాలా ఎక్కువ మంచి సేవలు చేసేవారెందరో వున్నారు. వారెవ్వరికీ ఈ గుర్తింపులు, పద్మ భూషణ్ లు అవసరం లేదు. ఆ మాటకొస్తే చిరంజీవి కూడా ఈ గుర్తింపుల కోసం చేస్తున్నారనిపించదు. మరి ఈ హడావిడికి కారణమెవ్వరు?

నిజానికి ఈ హడావిడి చిరంజీవి అభిమానుల పేరు మీద జరుగుతున్నా, దీని వెనుక ఒక బలమైన కుల వర్గం వుంది. చిరంజీవి ఇప్పుడున్న మేరు నగ స్థానానికి కారణం కులం కాదు. కానీ అతని జీవితంలో తరువాయి అంకంలో రాబోయే అన్ని మచ్చలకూ అదే కారణం అవుతుంది. ఈ బెల్లం చుట్టూ మూగిన ఈగల గోల కూడా దాని వల్లనే. అది అలా వదిలేస్తే, కేవలం సినిమాలు, కొన్ని ఛారిటీ పనులు చేసినంత మాత్రాన వచ్చిన ఫేమ్ ను పరిపాలానాధికారాలు సాధించడానికి వాడుకోవటం విజ్ఞత కూడా కాదు. మొదట ఈ ప్రభుత్వాల మీద, పరిపాలన మీద తనకున్న ఆలోచనలను ప్రజలతో ప్రస్పుటంగా పంచుకోవాలి. అందులో ఒక విజన్ వుండాలి. అవి వుంటే ఎవరూ చిరంజీవి రాజకీయ ప్రవేశం మీద లేశమాత్రమైనా వ్యాఖ్యలు చెయ్యరు.

ఇప్పుడున్న రాజకీయనాయకులకు వోటు ఎందుకు వెయ్యకూడదు అనుకుంటే సవాలక్ష కారణాలు వరసగా చెప్పుకుపోవచ్చు. అందుకే నేనిప్పటి వరకూ వోటు వెయ్యలేదు. పొరపాటున కూడా నా వోటు హక్కు కోసం నేను ఒక వెధవ నాయకుడికి వోటు వెయ్యనుగాక వెయ్యను.

నేను చిరుకు ఓటు వెయ్యాలంటే, వేస్తా…నా మట్టుకు అతని వెయ్యకపోవటానికి ఏ కారణాలూ లేవు. కానీ ఎందుకు వెయ్యాలి అని ఆలోచిస్తే నాకు మనస్సులో అంతా ఖాళీగా వుండకూడదు. అప్పుడే మనస్పూర్తిగా వోటు వెయ్యగలుగుతా. లేక పోతే నా వోటు ఒక వంద రోజుల సినిమా టికెట్ట్లుకు సమానం. సినిమా అయిపోయాకా దానికి ఏ మాత్రం విలువుండదు.

Saturday, December 08, 2007

చెన్నయ్ సూపర్ స్టార్ర్సు....!

ఐసియల్ ప్రకటనలు చాలా సృజనాత్మకంగా భలే వున్నాయి. మచ్చుకి ఇది చూడండి. :-)

Thursday, November 29, 2007

నిప్పులాంటి నిజాం

పైన రాసిన టైటిల్ని చూస్తే మీకు ఒళ్ళు మండిందా? అయితే మీరు ఖచ్చితంగా తెలంగాణా స్వాతంత్ర సమరయోధుల కష్టాలతో తడిసిన చరిత్ర తెలిసిన వారయి వుంటారు. మరి ఇప్పుడు అనుకోకుండా నిజాం నిప్పు ఎలా అయ్యాడబ్బా? పోనీ ఎవడైనా రాత్రి బాగా తాగి మాట్లాడినా చాలా వరకూ నిజాలు కక్కుతారు గానీ ఇలా అడ్డగోలు చరిత్ర మాట్లాడరే ?. ఈ లెక్కన మనకు పాకిస్తాను, బంగ్లాదేశు కూడా అద్భుతమైన పాలకులు పరిపాలించిన దేశాల క్రిందే లెక్క.పోనీ మన మాష్టారు నిజమే చెప్పారనుకుందాం...మరి ఆ లెక్కన తెలంగాణా ఉద్యమం ఎవరికి ఎదురొడ్డి జరిగింది? అది కూడా కొంపతీసి వలస వాదుల మీదేనా? రజాకార్లందరూ తూర్పు గోదావరి, గుంటూరుల నుంచి భూములు కొనటానికి వచ్చిన తురుమ్ ఖాన్లా? సరిగ్గా చెప్తే చరిత్ర మార్చేసుకుంటాం కదా?

పీవీ నరసింహారావు గారి ఆటో బయోగ్రఫీ చదువుతుంటే అందులో ఆనంద్ పాత్రధారి పర్షియన్ భాష చదివి, అది ఎందుకు చదవాల్సి వచ్చిందో చెప్తూ వుంటే మనిషన్న వాడికి మంట పుట్టటం ఖాయం.ఫలక్ నుమా వాడు కట్టాడు, అసెంబ్లీ హాలు వీడు కట్టాడు అని చెప్పేముందర అవి ఇప్పుడు వాడుతున్న కారణాల కోసం అప్పటి రోత నవాబులు కట్టలేదని పిల్లి పిడికిలంత మెదడున్నవాడికెవడికైనా అర్ధం అవుతుంది.మరి అంత మంచి నిజాము ఇక్కడుండకుండా టర్కీ ఎందుకెళ్ళి బతుకుతున్నాడో ఈ మన నవాబుకే తెలియాలి.

Tuesday, November 13, 2007

TV9 : కోఠీ కాలేజీపై కుక్కల దాడి (కేవలం TV9 లో)

ఇరవై నాలుగ్గంటల వార్తల ఛానల్ పెడితే ఇన్ని కష్టాలుంటాయని తెలీదు. :-)కాదేదీ వార్తా స్రవంతికి అనర్హం అని నిరూపించారు. అదీ లైవ్ కామెంటరీ (చాలా కామెడి కామెంటరీ)

ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హాట్ హాట్. ఏ వీడియో పడితే ఆ వీడియోని ప్రైవసీ అనే పదాన్నే పట్టించుకోకుండా ప్రసారం చేసే TV9 మరి ఈ వీడియోని కూడా ప్రసారం చేస్తే మంచిది.

Sunday, November 11, 2007

అంతా నువ్వే చేశావు....అవును అంతా నువ్వే చేశావు.

ఈ మధ్య ఈనాడు ఆదివారం సంచికలో ఇదే తరహాలో ఒక పేరడీ ప్రచురించారు. అది చూసి, ఆ ప్రేరణతో రాసినది ఇది.

ఇవి బొమ్మరిల్లు అనే మంచి చిత్రంల్లో, బాగా హిట్టయిన సంభాషణల పరంపర. దీనిని సిద్ధార్ద్, ప్రకాష్ రాజ్ అద్భుతంగా రక్తి కట్టించారు.



గోపి : అంతా నువ్వే చేసావు. మొత్తం నువ్వే చేసావు. చాలు రాధా పెళ్ళైన నాటి నుంచి నువ్వు నా చేత చెయ్యించిన పనులు చాలు. ఇక వద్దు ప్లీజ్.

రాధ : గోపీ…నేనేం చేసాను

గోపి : ఇంకా అర్ధం కాలేదా నీకు. పక్కింటి బ్యాచిలర్ కుర్రోడు దగ్గర ఏముందో, అదే నేను కోల్ఫోయింది. ఆనందం. జీవితంలో సొంత ఆనందాలను కోల్పోయాను నీ వల్ల.

నువ్వు ప్రపంచంలోనే గొప్ప భార్యవి రాధా. నీ భర్త ప్రపంచంలోనే ఒక గ్రీకు వీరుడు అవ్వాలని ఆలోచిస్తావు తప్ప, అసలు నా సీను ఏంటో అర్ధం చేసుకోవు.

రాధ : నేనేది చేసినా వెయ్యి సార్లు మీకు అది బాగుంటుందో లేదో ఆలోచిస్తా గదండి.

గోపి : అవును వెయ్యిసార్లు నాకు బాగుంటుందో లేదో ఆలోచిస్తావు, నాకు నచ్చిందో లేదో ఆలోచించవు.

పని చెయ్యటంలో ఆనందం నీకు తెలుసు. గానీ ఏ పని చెయ్యనివ్వకపోతే పడే కష్టం ఏంటో నాకు తెలుసు.

అసలు నన్ను ఏదైనా చెయ్యనిస్తేగా నా బాధేంటో తెలియటానికి. నీకు ఏదైనా ప్రాబ్లెం వస్తే ఎదురింటి రిటైర్డు ముసలాయన్ను సలహా అడుగుతావు. నన్ను అడగవు. నాతో మాట్లాడు రాధా…ఫ్రెండ్లీగా వుండు రాధా…

రాధ : ఆ మాట అనేది నేను కదండీ (గద్గద స్వరంతో)

గోపి : అంటావు. కానీ వుండవు. ఎందుకంటే అంతా నువ్వనుకున్నట్లే జరగాలి కదా

ఈ కూరలు కొనాలో నువ్వే చెప్తావు. నాకెలా వుంటుందో తెలుసా. నాకు ఆ కాకరకాయ నచ్చదూ అని గొంతెత్తి అరవాలనిపిస్తుంది. నేను తినను అని పారిపోవాలనిపిస్తుంది.

బజారుకెళ్ళి చికెన్ తెమ్మంటావు. అక్కడికి వెళ్లేలోగానే పక్కింటి కుర్రాడిని పంపి వాడి చేతే అది బేరమాడించి కొనిపించేస్తావ్. నవ్వుతున్నారు రాధా బజారులో అందరూ.

నేనేదో క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటాను. గానీ నువ్వు నేను "సాగే జీవితం 34233 వ ఎపిసోడ్" చూసి ఆనందించాలనుకుంటావ్. అదే నాకిష్టమని అందరితో చెప్తావు.

నేనేదో మాడి పోయిన మసాలా దోశ ఒకటి వెయ్యాలనుకుంటాను. కానీ నువ్వు దానిని ఇంకా బాగా, అందంగా ఎలా చెయ్యెచ్చో చెప్తూ నా దోశ కూడా నువ్వే వేసేసి సరదా పడిపోతావ్. నేనెలా చెయ్యాలో కూడా నువ్వే చెప్ర్తుంటే ఇంకా నేనెందుకు రాధా దోశలు వెయ్యటం?

చివరికి షేవింగ్ ఎలా చేసుకోవాలో కూడా నువ్వు చెప్తుంటే గడ్డం అస్సలు తెగటం లేదు రాధా. నీకు తెలీదు. నువ్వు చెప్పింది చెయ్యలేక, నాకు నచ్చింది చెప్పలేక నరకం అనుభవించాను రాధా. నరకం.

ఈ ఫ్రస్టేషన్, బాధ ఎవరిమీద చూపించాలో తెలియక ఒక సారి మన టామీ మీద గట్టిగా అరిచాను కూడా. అది ఇప్పటికీ నా వైపు అనుమానంగా చూస్తునేవుంది. దగ్గరికి రావటం లేదు.

సరే, నేనిప్పుడు ధోనీలా జుత్తు పెంచాలి అంతే గదా? మీసాలు తీసెయ్యాలి అంతే కదా. చేస్తాను రాధా. నేను అవి చేస్తే ఛండాలంగా వుంటానని తెలుసు. అయినా చేస్తాను.

భార్యగా నువ్వు ఇన్నాళ్లు ఉప్పొంగిపోతున్నావు కదా? నువ్వలా ఉప్పొంగిపోవటం కోసం గత ఏడు సంవత్సరాలుగా నేను భర్తగా ఓడిపోతూనే వున్నాను రాధా. ఇలా ఓడి పోతూ వుంటే మరో మూడేళ్ళలో నా పెళ్ళి జీవితం ఏంట్రా అని చూస్తే, అందులో నేనుండను. నువ్వుంటావు. అంతా నువ్వే వుంటావు.

Friday, November 09, 2007

ప్రేక్షకుడి రక్షణ ఒక "చేతి తడుముడు" పొడవు మాత్రమే

రాత్రి హ్యాపీ డేస్ సినిమాకెళ్లాను. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ (మన నగరానికి అదొక నగ అని చంద్రబాబు అభిప్రాయం) రాత్రి పది నలభై అయిదు నిమిషాలకు సినిమా అయితే నేను దాదాపు తొమ్మిదిన్నరకే చేరుకున్నా (ఇంటర్నెట్ కొనుగోలు కాబట్టి). నా స్నేహితుడు రావటానికి ఇంకా సమయముండటం వలన అటూ ఇటూ తిరుగుతుండగా సెక్యూరిటి మనుషులు నా దృష్టిని ఆకర్షించారు. అసలు వీల్లెలా పని చేస్తున్నారో చూద్దామని ఆసక్తిగా గమనించటం మొదలు పెట్టా…

అక్కడ రెండు సెక్యూరిటీ ద్వారాలున్నాయి. చెక్కతో చేసినవవి. కాబట్టి కాస్త చవకవే కొనుక్కున్నట్టున్నారు. రెండింటి గుండా పొలో మని జనాలు రావటం మొదలుపెట్టారు. మగవాళ్ళందరిని ఆపి ఏదో తడమాలన్నట్లు తడిమి వదులుతున్నారు.( నన్ను తనిఖీ చేసినపుడయితే వాడి చెయ్యి నా మొబైల్ని ముట్టలేదు కూడా). ఈలోగా కొంతమంది స్త్రీలు వచ్చారు. లోపలికి వచ్చాక దిక్కులు చూస్తున్నారు. బహుశా తనిఖీ చేస్తారని అనుకుంటా..

మీరెళ్ళండి మేడమ్ అని వారిని లోపలకు పంపేసారు. ఇక అప్పటి నుంచి వస్తున్న స్త్రీలందరికి ఇదే తంతు. మరి ఇదే రకం సెక్యూరిటినో అర్ధం కాదు. మగోల్లేమన్నా బాంబులు బుర్రలో పెట్టుకుని పుట్టారా? ఆడోల్లలో ఆత్మహత్యా బాంబర్లు వుండరా? అసలే ఈ మధ్య ఆడోల్లు మగాళ్ళతో పొట్టలలో సమానత్వం సాధించేసారు. (సీరియస్ గా తీసుకోవద్దు…ఇది మా ఆఫీస్లో ఆడోల్లు వేసుకునే జోకే…:-))

నేను వుండబట్టలేక వెళ్ళి వాడినడిగా. వాడు నా వైపు చూసి హి హి అని నవ్వాడు. నేను కాస్త సీరియస్ గా చూసేసరికి "నన్నడుతారేంటండి…మానేజర్ని అడగండి" అన్నాడు. వాళ్లే అమ్మాయిలను పెట్టటం లేదు ఈ పనికి…మేమేం చేస్తాం సార్ అన్నాడు. అయితే మీ మానేజర్ని పిలు అన్నాను. వాడికి లైట్లు ఆరిపోయాయి. మౌనంగా తన పని తను చెయ్యటం మొదలుపెట్టాడు. మరీ తిడితే ఫీలవుతాడేమొనని నేను నోర్మూసుకుని సినిమా చూడటనికి పోయాను. ఇక్కడ సంగతేంటంటే స్త్రీలను తనిఖీ చేసే స్త్రీలు రాత్రి తొమ్మిది తర్వాత పని చెయ్యరంట. మరి ఈ పద్దతితో వాళ్ళ సెక్యూరిటీ ఏ విధంగా ఏడుస్తుందో అర్ధం అవుతుంది.

ఆ ద్వారాల నుంచి పోతుంటే ఒక సారి కుయ్ మని , ఒక కుయ్ కుయ్ కుయ్, కక్, క్వీ అంటుంది. ఈ భాషకు అర్ధం వాళ్లకు తెలుసా అంటే…ఏమో చెప్పలేం.

ఏది ఏమైనా పేరు గొప్ప వూరు దిబ్బ అన్న నానుడి ఈ ప్రసాద్ ఐమాక్స్ కు సరిపోతుంది. పాప్ కార్న్, ఖరీదయిన మంచి నీరు అమ్మటానికి కుప్పలు కుప్పలు జనాలుండే ఈ థియేటర్లో ప్రేక్షకుడి రక్షణ ఒక "చేతి తడుముడు" పొడవు మాత్రమే.

మాకు తెలీదేటి మరి

ఏటండీ ఈ ఇడ్డూరం. నీ సంగతి నాకు తెలుసంతారొకరు….సె ఎల్లెహె నీ సంగతి నాకూ తెలుసంతాడింకొకాయన. మరి తెలిస్తే మాకు సెప్పకుండా ఎందుకూంతున్నారు బాబు. అహ నా కర్ద్గం గానేదు కానీ, ఈ సంగతులేవో సెప్పేత్తే మా బాగా వుంటాది కదా.

ఓహొ మా బాబులు మా సెవుల్లో పువ్వుల్నేవండీ. మాకందరికీ మీ ఇద్దరి సంగతులూ తెలుసునండీ బాబులు. ఏటి? అలా సూత్తారేటి. ఎందుకు మిమ్మల్ని అదే పనిగా గుద్ది గుద్ది గెలిపిత్తన్నామనా?

అదేనండి మా జన్మలో చేసుకున్న ఖర్మ..

మీరంతే రోజు గుప్పెళ్లు, గుప్పెళ్లు కారం, వుప్పు తింతారు. మాకు అవి అట్టుకురావటానికి సొమ్ములేవి? అందుకే మామవి తినం.

అందువల్ల మాకు సిగ్గు నేదు, శరం నేదు. వోట్లు గుద్ది మిమ్మల్ని ఆ మాయదారి ఇల్లు, అదేటండి అంటారు….ఆ ఏదో అసెంబులీ అని….అక్కడికి పంపుతాం. కొట్టుకు సావడానికి మీ జిమ్మలరిగి పోయేలా…

Thursday, November 08, 2007

ఒప్పించే శక్తి ఒక వరం

ఈ మధ్యన ముంబైలో ఒక సెమినార్ కు హాజరయ్యాను. ఆ సెమినార్లో భాగంగా సాఫ్ట్ స్కిల్స్ ఫర్ సాఫ్ట్ వేర్ ఆర్కిటక్ట్స్ అనే అంశం మీద ఒకాయన అద్బుతంగా ప్రసంగించాడు. అందులో నాకు బాగా నచ్చింది "conviction" అనే అంశం. మనం చెప్పేది తప్పా? ఒప్పా అనే విషయం ఎక్కడా పనిచెయ్యదు. మనం ఎదుటివారిని కన్విన్స్ చేసామా లేదా? అనేదే ముఖ్యం. అందుకు ముందర మనలని మనం కన్విన్స్ చేస్తుకోవటం చాలా ముఖ్యం. ప్రముఖ వార్తా పత్రికలు చేసేది అదే. అవి రాసేది తప్పుడు వార్తలయినా ఈ "conviction" అనే దానిని మహా బలంగా వాడుతాయి. జనాలలో వున్న Negative Pulse ని బాగా లాగి లాగి ఒక్క సారి వదిలి, అప్పుడు విషయాన్ని రాస్తాయి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. పైన చెప్పిన వక్త ఒక మంచి జోకు కూడా చెప్పాడు (ప్రసంగం మొత్తం నవ్విస్తూనే వున్నాడనుకోండి)

ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక ఎత్తైన శిఖరం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు.

అది ఒక సాఫ్టు వేర్ నిపుణుడు చూసి, అతనిని ఎలా అయినా ఆపాలని…కేకలు వేస్తూ ఒక్కసారి ఆగు వస్తున్నా అని అరిచాడు

అతడు మనోడి వైపు చూసి, కొద్ది సేపు ఆగాడు…

అతికష్టం మీద ఆ శిఖరం ఎక్కి అతని దగ్గరకు వెళ్ళాడు

ఒక పది నిముషాలు వాళ్లిద్దరు మాట్లాడుకున్నాక……

ఇద్దరూ ఆ శిఖరం మీది నుంచి దూకి చచ్చారు.

అదన్న మాట "conviction" కి వున్న శక్తి. :-)

Sunday, November 04, 2007

ఎంత అందమైన లోకం? - లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్

ఈ పాట నాకు జాజ్ సంగీతంలో తెలిసిన ఏకైక పాట. అత్యంత ఇష్టమైన పాట. రాప్సోడీలో ఈ పాటను రోజుకొక్కసారయినా వినాలనిపిస్తుంది.
మీరు వినండి. ఈ పాటను ప్రఖ్యాత జాజ్ గాయకుడైన లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్ పాడారు. ఆనందం, మార్దవం, ఆప్యాయత అంతా ఒకే సారి చూడాలనుకుంటే లూయిస్ పాడుతున్నపుడు అతన్ని చూడాలి.

Tuesday, October 30, 2007

అ అంటే అసురులు…ఆ అంటే ఆటోవాలా

పై విధంగా భవిష్యత్తులో పిల్లలు చదువుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే వారు రోజు స్కూలుకు వెళ్లే ఆటోనే వారికి మొదటి స్కూలుగా తయారయి ఆటో వాలాల పెడ బుద్ధులు అలవాటు అయ్యే లక్షణాలున్నాయి మరి.

ఆటోని 99 శాతం వాడేది మధ్య తరగతి, దిగువ తరగతి ప్రయాణీకులే. ఇప్పుడు జరుగుతున్న సమరమంతా వారిని ఎన్ని రకాలుగా దోచుకోవాలా అన్నదే. ఆ మధ్య ఆరుగురు పిల్లలు వెళ్తున్న ఒక ఆటోను చూసి అవాక్కయ్యాను. వారందరూ చిన్న పిల్లలే అయినా, పెద్ద పెద్ద మూటలలాంటి బ్యాగులు వున్నాయి. అమ్మాయిలూ వున్నారు. అప్పటికే ఆటోలో ఎలానో సర్దుకు కూర్చుని అమాయకంగా చూస్తున్నారు పాపం. వారిని అలా పంపిస్తున్న తల్లితండ్రుల మీద చిర్రెత్తుకొచ్చినా, స్కూల్లు, వాటి దూరాలు, ఆర్దిక కారణాలు గుర్తొచ్చి "పాపం పేరెంట్స్" అనుకున్నాను.

ఇప్పుడు ఆ సంఖ్యను "ఎనిమిది" కి పెంచాలంట. పిల్లకాయలు అని సరదాగా అనుకుంటాం..వారేమీ నిజంగానే "కాయలు" కాదు. బస్తాల్లో కుక్కినట్లు ఆటోలో కుక్కడానికి. ఈ ముదనష్టపు ఐడియాకి సీ.పి.యమ్, సీపిఐ లాంటి అవకాశవాద బూర్జువా పార్టీల మద్దతు. కాంగ్రెస్‍వి వోటు బ్యాంకు రాజకీయాలంటూనే తెలుగు దేశం కూడా ఈ చెత్త బ్లాక్ మెయిలింగ్ అంశాలకు మద్దతు ప్రకటించింది.

"ఠాగుర్" చిత్రంలో ప్రకాశ్ రాజ్ తన పాట్లు చూసి గేలిగా నవ్విన తోటి కానిష్టేబుల్ ని ఉద్దేశించి ఇలా అంటాడు "నవ్వురా నవ్వు…నువ్వు ఈ రోజు నన్ను చూసి నవ్వుతున్నావు…రేపు నిన్ను చూసి నేను నవ్వుతాను…ఇలా మనం ఉండబట్టే మన జీవితాలను చూసి అందరూ నవ్వుతారు" అని. సరిగ్గా ఈ డైలాగ్ గుర్తులేదు కానీ, అది సరిగ్గా మన రాజకీయ పార్టీలకు సరిపోతుంది. ఒక సరళీకరణ మార్పును ప్రభుత్వం తెస్తుంది అంటే, వారిని అభినందించి సహకరించటం మానేసి దోపిడీ మూకలకు మద్దతిచ్చేస్తున్నాయి ఇప్పటి పార్టీలు.

కొన్నాల్లకు కనీసం పారిపోయే ఛాన్స్ ఇవ్వకుండా పట్టేసుకుంటున్నారని గజ దొంగలందరూ ఒక ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను వినిపించినా "హాశ్చెర్యం" లేదు. దానికి అన్ని పార్టీలు "బే సిగ్గు" గా మద్దతు ప్రకటించేస్తాయి. మద్దతేగా….ఫ్రీ నే గదా..ప్రకటిస్తే పోలా…

ఇక ఆటో చెత్త విషయం..

అందరికి తెలుసు ఈ క్రింది విషయాలు….

౦౧. నగరంలో ఎనభై శాతం చెత్త మీటర్లే వాడుబడుతున్నాయి (ఇది ఒక శాతం అని ఆటోవాల్ల కారు కూత)

౦౨. చాలా వరకు ప్రమాదాలకు కారణం ఆటోలు (ఈ ప్రమాదాలలో అవి ఏమి అవ్వవు…)

౦౩. అతి ప్రమాదకర డ్రయివింగుకు చిరునామా ఆటోవారే

౦౪. తొంభై శాతం ఆటోలు సిగ్నల్స్ ను పాటించే సీనే లేదు

౦౫. చాలా వరకూ ఆటోలు అద్దెకు తీసుకుని తిప్పేవే…(వాటి సొంతదారులందరూ బడా బాబులు…)

౦౬. మహిళలకు రాత్రుల్లు ఇప్పటికీ ఆటో ప్రయాణం సురక్షితం కాదు (ఇక ఆటోల స్థానే కార్లు వస్తే? వామ్మో…)

౦౭. నగరంలో ట్రాఫిక్ నరకానికి ప్రధాన కారణాలలో ఒక కారణం ఈ ఆటోలే.

౦౮. ఆని రకాల ఆక్రమణలు వీరు సొంతం ..బస్ స్టాండులు, రోడ్డులో కొంత భాగం, ప్రధాన రోడ్ల మలుపులు ఒకటేమిటి.


మొన్న మా అఫీసులో ఒక మహిళా కొలీగ్ ఇలా అన్నారు…"అసలు ఈ లక్ష ఆటోలను తీసేసి చిన్న చిన్న బస్సులు తిపితే నయమండి…సుఖంగా వుంటుందని". నిజమే అనిపించింది. ఆటోలు ప్రయాణ సాధనాలు. అంతే. అక్కడితో ఆగాలి. అంతే గాని అదేదో కల్లు గీత పరిశ్రమలాగా హడావిడి చేసి యూనియన్లుగా తయారైతే ఇలానే వుంటుంది.

రేప్పొద్దున్న సిటీ బస్సుల సంఖ్యను తగ్గించమని డిమాండు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.

భవిష్యత్తులో ఈ నగర జనాభాను ఆ దేవుడే రక్షించాలి…చివరకు "ఆటోల యూనియన్ నుంచి", "తోపుడు బల్ల సంఘం నుంచి", "జూబ్లీ హిల్స్ కాల్పు గాళ్ళ సమితి నుంచి", "కొజ్జా నేరగాళ్ళ యువత నుంచి",

రాజకీయమా ! నువ్వు మాత్రం నీ కుళ్లు నవ్వు ఆపకు. నీకది అచ్చి వచ్చిన నవ్వు. కనీసం తరువాతి ఎన్నికల వరకూ..

Monday, October 22, 2007

ఈ వారం బ్లాగ్విషయం : నేటి కాలంలో 64 కళలు ఏవి?

ఈ వారం విషయం: నేటి కాలానికి అరవైనాలుగు కళలు.

మీకంతా తెలుసు కదా, మనకు అరవై నాలుగు కళలు అంటారని, బహుశా అవి నాటి రోజులలో అప్పటి అవసరాలకు తగ్గట్టూ ఫ్రేం చేసి ఉంటారు.

అదే ఈ రోజుల్లో అయితే మనము ఏవి అరవై నాలుగు కళలుగా పరిగణించాలి?

వేటిని నేర్చుకుంటే సకలకళాప్రవీణ అని పిలవ వచ్చు?

నా పుర్రెకు తోచిన కళలు ఇవి...

౦౧. కంప్యూటరు కళ
౦౨. ట్రాఫిక్కు కళ
౦౩. రాజకీయము
౦౪. అబద్ధము
౦౫. భూముల అమ్మకము
౦౬. భూముల కొనుగోలు

Wednesday, October 17, 2007

నా చిత్ర బ్లాగు ఇక బ్లాగరుకు బై.బై అంటోంది

నా చిత్ర బ్లాగుకు దసరాకు సరికొత్త బట్టలు తొడిగా..ఇక బ్లాగరుకు బై.బై :-)

నా చిత్ర బ్లాగును దర్శించి మీ అభిప్రాయం తెలపండి.

http://www.visualode.org

Friday, September 28, 2007

హాలో మూడు...ఆటల ప్రపంచంలో అమ్మకాల రికార్డులు బద్దలు

ఈ అమెరికోల్లకి కంప్యూటర్ ఆటల పిచ్చి కొద్దిగ ఎక్కువ అని తెలుసు గానీ, ఇంత ఎక్కువని తెలీదు. XBOX 360 కోసం తయారయిన Halo 3 ఆట విడుడలయిన ఇరవై నాలుగ్గంటలలో 170 మిలియన్ల డాలర్లు అమ్మకాలు జరిగి, కంప్యూటర్ ఆటల రంగంలో కొత్త రికార్డు సృష్టించింది.

అంతే కాక అదే రోజు ఇంకో రెండు రికార్డులు...అత్యధిక ముందస్తు అమ్మకాలు, అత్యధిక అంతర్జాల ఆటగాళ్ళు ఆడిన ఆటగా రికార్డులకెక్కింది.

ఇక్కడ మీరు కధనం చదవవచ్చు.

ప్రతిష్టాత్మక MIT విశ్వవిద్యాలయం విద్యార్ధులు Halo 3 విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సరదా విగ్రహం

Thursday, September 27, 2007

సెప్టెంబరు నెలలో పదివేల దర్శనాలు

ఈ సంవత్సరం తెలుగు బ్లాగులను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సెప్టెంబరు నెలలోనే నా బ్లాగు దర్శనాల సంఖ్య పది వేలు దాటేసింది. వావ్...

Tuesday, September 25, 2007

ప్రపంచ ఇరవై-ఇరవై : మరిచిపోలేని మధుర క్షణాలు

ఇండియా, పాక్ ని ప్రపంచ వరల్డ్ కప్ మొదటి బౌల్ - ఔట్ లో ఓడించిన మధుర క్షణాలు



యువరాజ్ సింగు వరుసగా ఆరు బంతులకు ఆరు ఆర్లు బాదిన మధుర క్షణాలు (విలువ : కోటి రూపాయల బహుమతి)




ఫైనల్ పోటీలో మిస్బా ఉల్ హక్ కు జోగిందర్ వేసిన చివరి మూడు బంతులు

Monday, September 17, 2007

సమాల్‍ చేసింది తప్పా ఒప్పా?

దేశంలో తొలి సారిగా ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద తేనె తుట్టెనే రేపారు. ప్రభుత్వ రంగంలో అంతులేని అవినీతి వున్నదనేది ఎవరూ కాదనలేని నిజం. అంతే కాదు ఈ అవినీతికి కొమ్ము కాసే వారు సాక్షాత్తు రాజకీయ నాయకులేననీ అందరికీ తెలుసు. చిన్న చిన్న విషయాలలో కూడా తల దూర్చి కాంట్రాక్టుల కమీషన్లు కొట్టడం మన ఎమ్.ఎల్.యే లకు అలవాటే. దీనిలో అన్ని పార్టీలతో సహా ఎవరికి మినహాయింపు లేదు. ఒకరికి ఒకరు సాటి.



అయితే ఇప్పుడు సమాల్ ఆరోపణలు విషయానికొస్తే...నాకు వచ్చిన ఆలోచనలు ఇవి..




  • అధికారంలో వుండగా అసలు అందరినీ వణుకు పుట్టించేలా రిపోర్టులు ఇవ్వొచ్చు..ఎందుకు చెయ్యలేదు ?


  • విజిలెన్సు రిపోర్టును అసెంబ్లీకి సమర్పిస్తారు. సమర్పించవచ్చు కదా?


  • ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఏ.సీ.బికి గానీ, ముఖ్యమంత్రికి గానీ రహస్య నివేదిక సమర్పించవచ్చు కదా?


  • ప్రభుత్వ విజిలెన్సు డాటా ను రిటైర్మెంటు తర్వాత పత్రికలకు ఇవ్వటం ఎంతవరకూ సమంజసం?


  • మూడు సంవత్సరాలుగా విజిలెన్సు నివేదికలు ఇవ్వకపోతే, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?


  • హఠాత్తుగా ఇప్పుడు సమాల్ మీద అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న వారు ఇప్పటి వరకు ఎందుకు ఊరుకున్నారు?


  • కుల ప్రసక్తితో సమాల్ మీద ఎదురు దాడికి దిగటం అంత అవసరమా? లేదా ఇంకో దారి దొరకక ఈ వ్యాఖ్యలకు తెగబడుతున్నారా?


  • ప్రతిపక్షాలు తెగ అల్లరి చేస్తున్నాయి ఇప్పుడు...గానీ వారు పక్షంలో జరిగిన వాటి మీద ఎప్పుడయినా చర్యలు తీసుకున్నారా? ఈ మూడేళ్ల లోనే హఠాత్తుగా అవినీతి కొండంతగా పెరిగిందా?


  • సమాల్ బయట పెట్టిన విషయాలు ప్రతి పక్షాలకు ఇప్పటి వరకూ తెలియదా? వాటికి ఆ మాత్రం లాబీయింగ్ నెట్వర్కు ప్రభుత్వంలో లేదా?



ఏది ఏమైనా అందరూ కలసి సామాన్యుడి జీవితాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అపహాస్యం చేస్తున్నారనేది నిర్వివాదాంశం. అది కాంగ్రెస్ అయినా, తెలుగు దేశం అయినా, సీపియమ్ లేదా భాజపా అయినా పెద్దగా తేడా లేదు. మనుషులే మారతారు. ఈ ఐ.ఏ.యస్ లు, ఐ.పీ.యస్ లు, రాజకీయ నాయకుల పంచన చేరి వారికి కుక్క సేవ చెయ్యకా మానరు. మన విస్తరిని చించకా మానరు.

Saturday, September 15, 2007

శోధనను కాలచక్రంలో ప్రతిశోధిస్తే...

ఈ రోజు ఈనాడులో తెలుగు బ్లాగుల మీద వ్యాసం వచ్చింది. చాలా సంతోషం. కొత్తగా వచ్చే వాళ్లకు నీ బ్లాగులో టపాలు ఎక్కువ కనిపించవు కదరా...ఎలా చదువుతారు అనడిగాడు మా ఫ్రెండొకడు. అందుకని గత రెండు సంవత్సరాల నుంచి రాసిన 200 పైగా వున్న టపాల నుంచి కొన్ని (బాగా హిట్లు వచ్చినవి, ఆదరణ పొందినవి) ఇక్కడ పెడుతున్నా...(పాతవి ముందర)

రాజధాని సిత్రాలు

భీముడు, బకాసురుడు...తెలుగు పరీక్ష

ఎవరు నేర్పారమ్మ ఈ పల్లెకూ?

అయ్యా అధ్యక్షా

మన సినిమా హాస్యం నిజంగా హాస్యమేనా

నీ కోసం ఎదురు చూసే వారెవరు?


హాయ్ నా పేరు గణపతి...౧
హాయ్ నా పేరు గణపతి...౨


హిందూ ఎక్కడి నుంచి పుట్టింది?

అంతా మన మంచికే

మరో పద్మ వ్యూహమా

బాబోయ్ TV9

నేను నష్ట పోయాన్రా బాబు

పిచ్చి భారతం

పావుకిలో పేరు మార్చాలి

మెగా ఆ(టో)గడాలు

తెలుగు సినిమా వజ్రోత్సవాలు,,,హీరోలు...జీరోలు - ౧
తెలుగు సినిమా వజ్రోత్సవాలు,,,హీరోలు...జీరోలు - ౨

అందమైన జీవితమా? అందమైన సెల్ ఫోనా


దేశ ముదురు (A)

ఇది నవ్వే విషయమా?

సీమాస్ పై (సీ)లిపి సాహసం

క్రికెటాభిమానులు...జర భద్రం

భారతీయులు, క్రీడా స్ఫూర్తి

ప్రాణ సంకట బాదు

పిల్లికి చెలగాటం...ఎలుకకి ప్రాణ సంకటం

నేనూ ఒక కవినే...

రామా? సేతువు కట్టావా లేదా?

గుర్తుకొస్తున్నాయి...గుర్తుకొస్తున్నాయి

తానా తందానా

ఎంతకాలం ఈ ఆత్మద్రోహం

నీకా ఛాన్స్ ఇవ్వను

సాఫ్ట్వేర్ రంగంలో బుర్రలు ఎంత వేడెక్కి జుత్తు రాలి బట్ట తలలు వచ్చేసినా, ప్రతీ పనిలోను వెతుక్కుంటే కుప్పలుగా వినోదం దొరుకుతుంది. కంగారులో, ఆతృతలో బయటపడే వినోదమన్నమాట. ఎలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుని పగలబడి నవ్వుకుంటాం. అలాంటిది ఒకటి... నేను ఎప్పుడూ మర్చిపోలేనిది ఇది...

అవి నా కెరీర్ మొదటి సంవత్సరపు రోజులు. ఒక చిన్న కొత్త కంపనీలో ఉద్యోగం. అది కూడా మా ఫ్రెండు గాడి ఎన్నారై చుట్టాలది, అందువలన మేమే దానికి ఆద్య్లులం, ఆర్యులం కూడా. మా ఎనిమిది మంది స్నేహితులు అక్కడే పని చేసేవాళ్లం. అప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చామో ఏమో, బాగా ఏపుగా పెరిగిన తోటకూర పొలంలోనికి బర్రెను తోలి..ఇక నీ ఇష్టం, తిను పో అన్నట్లుగా వుండేది మా పరిస్థితి. ఏది దొరికితే అది చదివెయ్యటం, ఇంటర్నెట్ను పీల్చి పిప్పి చెయ్యటం, రోజులు పద్దెనిమిది గంటలు పని చెయ్యటం అలవాటయిపోయాయి. కంపనీ నుంచి ప్రోత్సాహం అలానే వుండేది మరి. మేమందరం కలసి విబి, ఒరాకిల్ కాంబినేషన్ లో ఒక కంటెంట్ పోర్టల్ నడుపే సాఫ్ట్ వేర్ రాస్తుండే వాళ్లం. చాలా పెద్ద ప్రాజెక్టు అది. అందులో డాటా కూడా చాలా ముఖ్యమైనది.

ఒక రోజు నా స్నేహితుడు, ఆ సిస్టంలో వున్న పనికిరాని డాటాని తీసేసే ప్రోగ్రామ్ చాలా దీక్షగా రాస్తున్నాడు. సాధారణంగా ఎవరూ డాటాని తొలగించరు, దానిని ఇంకొక చోటకు తరలించెయ్యటమో, ఫ్లాగ్ చెయ్యటమో చేస్తారు. అది మాకు ఆ రోజులలో తెలియదు. వాడు ప్రోగ్రామ్ రాసేసాడు. మా ఇంకొక ఫ్రెండుని పెల్చి ఒరే ...ఇక నువ్వు టెస్టు చేసుకో..ఇటీజ్ డన్...యూనో అని రిలాక్స్ అయ్యాడు. వాడొచ్చి అప్లికేషన్ మొదలుపెట్టి, పనికి రాని డాటా అంతా వెతికి అంతా సెలెక్టు చేసుకుని "Delete Selected Data" అనే బటన్ నొక్కాడు. అప్పుడు వాడికి ఈ విధంగా స్క్రీన్ మీద కనిపించింది.(నేను దానిని మరలా తయారు చేసి పెట్టాను ఇక్కడ)



ఇది చూసాక టెస్ట్ చేస్తున్న మా ఫ్రెండు గాడికి డాటా బ్యాకప్ తీసుకుంటే మంచిదేమో అన్న ఆలోచన వచ్చింది.వాడు..కానీ అక్కడా "Cancel" బటన్ వుంటేగా? ఒకే ఒక్క ఆప్షన్.వెనుతిరిగే ఛాన్సే లేదు :-) వాడు వెనక్కు తిరిగి అయోమయంగా, అదో రకంగా మా వాడి వైపు నవ్వాలా, ఏడాలా అన్నట్లు చూసాడు. వాడిదీ అదే పరిస్థితి. కంగారులో "Cancel" పెట్టలేదు వాడు. అయితే ఇంకేం చేస్తాం...ఇక్కడ "Ok" బటన్ నొక్కకుండా వదిలేసి, డాటా సర్వర్ మీద నుంచి కాపీ చేస్తా ఒక్క నిముషంలో అని పరిగెత్తాడు. గబ గబా క్వెరీలు అవీ రాసి ఆ డాటా వెతకటం మొదలు పెట్టాడు. ఎంతకూ దొరకదే...

తీరా అనుమానం వచ్చి ఆ అప్లికేషన్ కోడ్ చూస్తే...

డాటా అంతా చెరిపేసాకే మా వాడు ఆ సందేశం ("Are you sure..") చూపిస్తున్నాడు. అదీ ఒక్క బటన్ తో...

ఇక ఆ రోజంతా కడుపు నొప్పొచ్చేలా నవ్వుకున్నాం...ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వొస్తూనే వుంటుంది.

Tuesday, September 11, 2007

ఐ టీ ఉద్యోగుల ఆగష్టు నెల బాధలు

ఆగష్టు, సెప్టెంబరు నెలలు సమీపించే కొద్ది సాఫ్టువేరు ఇంజనీర్ల పనితనం ఒక్క సారిగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ నెలలలోనే తమ పనితనం తాలుకా మూల్యాంకనం జరిగి కొత్త జీతాలు నిర్ణయిస్తారు కాబట్టి. ఎవడి వైపు చూసినా చాలా ప్రో యాక్టివ్ గా పని చేసేస్తుంటారు. వార్నీ..ఈడి పొట్టలో అణు రియాక్టరు వుందా అని అనుమానాలు వస్తాయి వాళ్ల వైపు చూస్తే...ఇంతా చేస్తే అసలు పిలకంతా మేనేజరు చేతిలోనే వుంటుంది. మేనేజరును రకరకాల కోతి వేషాలు వేసి, సోపు రాసి ఆనందింపచెయ్యటం కొంతమంది చెయ్యగలుగుతారు. ఆ చేష్టలు ఈ టైములో ఎక్కువవుతాయన్నమాట. శుభ్రంగా బాగా పని చేసుకునే వాళ్లు మాత్రం అమాయకంగా ఎదురుచూస్తూ వుంటారు...నా మేనేజరు ఈ సారి ఏ కహాని చెప్తాడా అని. ఈ బాధలపై నితిన్ శ్రీ వాస్తవ్ అనే మన బోటి సాఫ్టు వేర్ నిపుణుడు గీసిన కార్టూన్ చూడండి. కడుపుబ్బా నవ్వుకోండి.










Sunday, September 09, 2007

ఇది ఒక తగలబడుతున్న రోమ్

ఇదేనా భాగ్యనగరం అనుకుని పదిహేను రోజులయ్యిందేమో...మరికొంత మంది అభాగ్యులు కన్ను తెరిచేలోపు ప్రాణాలు వదిలేసారు. ఎప్పటిలానే మన ఎక్స్ గ్రేషియా రాజకీయం రంగప్రవేశం చేసింది. ప్రతి రాజకీయ నాయకుడు పరిగెత్తుకొచ్చేసి ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించేసారు..ఎంత దయార్ద హృదయులు? వారికి చెందిన పార్టీల కార్యకర్తలు ఒక్కడొస్తే ఒట్టు. ఒక్క నాయకుడైనా తమ పార్టీ తరపున ఒక్క లక్ష ఎక్స్ గ్రేషియా ప్ర్రకటిస్తారేమో అని చూసా? ఛ ఛ అంత పని మన వాళ్లు చెయ్యటమా? నాయకుల సభలకు బ్యానర్లకు పెడతారు కోట్లు..మరి ఇక్కడ ఏం అడ్డు వస్తుందో వీళ్లకు?


మొత్తానికి ఒకటి అర్ధం అయ్యింది. మనకు ప్రత్యేకంగా ఎక్స్ గ్రేషియా మంత్రిత్వ శాఖ వుండాల్సిందే. ప్రతి నెలా క్రమం తప్పకుండా చనిపోతున్న రైతులు, అభాగ్యులు, పోలిస్ బాధితులు మొదలైన వారికి సక్రమంగా ఈ డబ్బులు అందచెయ్యటం అప్పుడు సులభం అవుతుంది.


మొన్నామధ్య ఈ నగరానికి ఏ.వన్ హోదా ఇచ్చినపుడు నాకు తిక్క రేగింది. అసలు ఏ.వన్ హోదా ఎందుకు, ఏ నగరానికి ఇస్తారో నాకు తెలియదు కానీ, మామూలు స్థాయి నుంచి అతి దరిద్ర స్థాయికి చేరుకున్న నగరాలకు ఇవ్వరని మాత్రం నాకు గట్టి నమ్మకం వుండేది. ఆ నమ్మకం ఆ రోజుతో పోయింది.



ఇక్కడ వర్షం పడితే ఒకరిద్దరు చనిపోతారు...మాన్ హోల్లలో పడి. దీనిని ఎవడూ బాగు చెయ్యలేడు. చేతులెత్తేసారు.



ఇక్కడ తీవ్ర వాదులు హాయిగా పాస్ పోర్టులు, రేషన్ కార్డులు తీసుకోవటానికి వస్తారు. ఇక్కడే సురక్షితంగా మకాం చేస్తారు.



ఇక్కడ చినుకు పడితే ట్రాఫిక్ నరకం. పోలీసులు మాత్రం మాయం



చలానాలతోనే సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం సంపాదిస్తారు ఇక్కడి పోలీసులు.



ఇక్కడ రోజుకు మద్యం విక్రయం ఒకటిన్నర కోటి.



ఎక్కడ బాంబుకు పేల్తాయో తెలియదు. ఎవరు పేల్చారో ప్రభుత్వానికి అంతకన్నా తెలియదు.



నాసి రకం రోడ్లు, స్కూల్లు, పార్కింగులు కూడా లేని షాపింగు మాల్లు..




ఇంకా చెప్పాలంటే ఇది ఒక భూలోక అవినీతి నరకంగా తయారయింది.


ఇది ఒక తగలబడుతున్న రోమ్




దేవుడా మా నీరో శేఖరుడికి కాస్త మెదడును, ప్రజలను పాలించే ప్రజ్ఞను ప్రసాదించు తండ్రీ..



రవీంద్రుని మాటలలో..



ఎక్కడ ప్రభుత్వం ప్రజలను తన వాళ్ళనుకుంటుందో



ఎక్కడ అవినీతి అడ్రస్ లేకుండా పోతుందో



ఎక్కడ అధికారులు, తమ పదవులను సేవాతత్పరతతో నిర్వహిస్తారో



ఎక్కడ ప్రజలు తాము సురక్షిత సమాజంలో వున్నామని భావిస్తారో



అక్కడా నా దేశాన్ని మేల్కొలుపు తండ్రీ

Sunday, September 02, 2007

ఇది అన్యాయం ..చాలా అన్యాయం :-(

ఇది అన్యాయం. చాలా అన్యాయంగా అంకితా మిశ్రా ని సోనీ ఇండియన్ ఇడోల్ పోటీల నుంచి మరొకసారి బయటకు పంపేసారు. నా అభిమాన గాయకుడు అమిత్ పాల్. అయినా ప్రస్తుతం మిగిలిన నలుగురు పోటీదారులు (అమిత్ పాల్, ప్రశాంత్, ఈమన్ ఛటర్జీ, అంకిత) లో అంకితా ఒక విలక్షణమైన గాయని. పాటొక్కటే కాదు, హావభావాలు, స్పోర్టివ్‍నెస్ లలో అంకితాకు సాటి ఎవ్వరూ లేరు. ఈ చెత్త నిర్ణయానికి sms లు తమ వంతు కృషి చేసాయి. ఎలాంటి పాటనైనా పవర్ హౌజ్ గొంతుతో అద్భుతంగా పాడటం అంకితకే సొంతం. అలాంటి మంచి గాయనిని ఇండియన్ ఐడోల్ కార్యక్రమం కోల్పోయింది అని చెప్పక తప్పదు. నాకైతే ప్రశాంత్ ని ఇంటికి ఎప్పుడు పంపుతారా ఎప్పుడూ అనిపిస్తుంది.

ఏది ఏమైనా నాకు చాలా బాధగా వుంది. ఈ లెక్కన అమిత్ పాల్ ని కూడా పంపేస్తారేమో :-(

Friday, August 31, 2007

ఎంతకాలం ఈ ఆత్మ ద్రోహం ?

పని వత్తిడి వలన ఇంతకాలం కొన్ని టపాలు చదవలేకపోయాను. అందులో ఈ మంచి టపా ఒకటి. చదివితే కొంతమంది బాధపడినా, అది నిప్పులాంటి నిజాన్ని ఒప్పుకోమని చెప్పగలిగిందనేది వాస్తవం. అవన్నీ చూసి, నిష్టూరాలు వేసే ముందు మొదట భారతదేశ సమీకరణాన్ని చూద్దాం, చరిత్ర చూద్దాం...ఎందుకు, ఏమిటి, ఎలా అనే మూడు చదువుదాం.

(CIA Fact Book, July 2007 లెక్కల ప్రకారం)

భారత దేశ ప్రస్తుత జనాభా : 1,129,866,154

మతాల పరంగా చూస్తే

హిందువులు : 80.5%

ముస్లిములు : 13.4%

క్రిష్టియన్లు : 2.3%

సిక్కులు : 1.9%

మిగిలిన వారు : 1.8%

అయితే భారతదేశం రాజ్యాంగపరంగా ఈ శాతాలను వేటినీ పరిపాలనా సిద్ధాంతాలకు ప్రాతిపదికగా తీసుకోజాలదు. మనది ప్రజాస్వామ్య లౌకిక సార్వభౌమ దేశం కాబట్టి. పాకిస్తాన్, బంగ్లాదేశాలలో ఈ శాతాలు మొత్తం ప్రభుత్వాలనే మత ప్రాతిపదికగా ఏర్పరిచాయి. ఆ దేశాలలో మైనారిటీల గోల వేరు. బాధలు వేరు. వారిని ఎవరూ పట్టించుకోరు. ఒక పట్టించుకుని ఎవరన్నా చిన్న పుస్తకం రాస్తే దేవుడి పేర తల తీసెయ్యమని ఒక ఫత్వా ప్రపంచవ్యాప్తంగా జారీ అయుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎవడో ఒకడు దానిని అమలు చేసెస్తాడు.

ఇక మన దేశంలో....మైనారిటి చట్టాలు ఎలా వుంటాయంటే, వారిని భారతదేశ పౌరులమేనా మనం అనే రకంగా భావించుకునేటట్లుగా నిర్ణయింపబడ్డాయి. వారి చట్టాలు వేరు, నిధులు వేరు, ఎండోమెంటు పనులు వేరు, స్త్రీల చట్టాలు వేరు, స్కూళ్ళు వేరు, ఆఖరికి కాలేజీలు కూడా వేరే. మన దేశంలో ఇంకా ఫత్వా అనేదానికి అర్ధం వుంది. అది ఒక ఇమామ్ జారీ చేసాడు కూడా. అదే ఫత్వాలో సగం తీవ్రతతో ఒక వాఖ్య ఏదైనా ఎవడైనా ఒంకొకడు చేస్తే పార్లమెంటు దుమ్మెత్తిపోతుంది. పార్టీలు పోటీలు పడి మైనారిటీ ప్రేమను చూపిస్తాయి. ఆ అన్నవాడికి మతతత్వాన్ని అంటగట్టేస్తాయి. ఈ డ్రామా చాలా రోజులనుంచి ఇలానే జరుగుతుంది. 

అలా అని ఈ దేశంలో హిందువులేమి తక్కువ కాదు. వారిలోనూ అతివాదులున్నారు. వెధవ పనులూ చేసారు, ప్రాణాలూ తీసారు. కానీ దేశంలో ఎంత మంది వారికి చేయూతనిస్తున్నారు? వారి  నెట్వర్క్ ఏమిటి? మహా అయితే ఒకటి రెండు రాజకీయ పార్టీలు. అవి కూడా దేశ రాజ్యాంగానికి లోబడినవి. వీరి నుంచి అన్య మతాలకు కొద్దిగా ఇరకాటాలుంటాయి, కానీ దేశానికి చిచ్చు మాత్రం పెట్టరు. అంటే పార్లమెంటు మీద దాడి చెయ్యటం లాంటివన్న మాట.

ఇక మిగిలిన శాతం చూద్దాం. 13.4% శాతంలో మహా అయితే 1.0 % శాతం మాత్రమే అతివాదులుంటారు. కానీ ఈ ఒక్క శాతం ఎంత ప్రమాదకరంగా మారుతుందో అందరికి తెలిసిందే. దానిని ఎవడూ ఒప్పుకోడు. ఒప్పుకుంటే వోట్లు రాలవన్న భయం. అసలు నాకర్ధం కానిది, "అఫ్జల్" గాడిని వురి తీస్తే మన దేశంలో ముస్లింలు ఎందుకు ఓట్లు వెయ్యరు? అలా అని రాజకీయపార్టీలు ఎందుకనుకుంటున్నాయి? ఆ లెక్కన మన దేశంలో ముస్లింలు దేశభక్తి ఏమన్నా లేని వారా? అద్భుత కళాకారులు, రాజ్యాంగ నిపుణులు, వైద్యులు అన్ని రంగాలలో స్రష్టలు వున్నారు కదా? మరి ఎక్కడుందీ సమస్య? ఎవరు ఈ ఇమేజ్ ను మన దేశపు ముస్లిములకు అంటగడుతున్నారు? ఎందుకు ఇస్లామిక్ తీవ్రవాదానికి మన దేశంలో చేయూత లభిస్తుంది?

బహుశా ఇవి కొన్ని కారణాలు కావచ్చు...

౦౧. ప్రభుత్వాలు, మదరస్సాలు వారిలో అవిద్యను పెంచి పోషించటం
౦౨. ప్రభుత్వపు సవతి తల్లి ప్రేమ
౦౩. అధిక స్థాయిలో పేదరికం
౦౪. పాత తరపు చాందస వాద ఇస్లామిక్ పార్టీల పట్టు

పైన పేర్కొన్న నాలుగు కారణాలు ఇస్లామిస్ తీవ్ర వాదులకు మన దేశం, ముఖ్యంగా హైదరాబాదు లాంటి నగరాలు పెట్టని కోటగా మారుస్తున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికి పాత నగరం కానీ, ఇతర ప్రాంతాలలో చిన్న రోడ్డు ప్రమాదం జరిగితే, ఆ చేసిన వాడు పారిపోవాలి, లేక పోతే వాడిని నడి రోడ్డులో చంపేసినా చంపేస్తారు. వాహనాలు తగలబెడతారు. ఈ కార్యక్రమంలో సాక్షాత్తు ఆ ప్రాంతపు ఎమ్మెల్యేనో, ఎంపీనో పాల్గొంటారు. భాగ్యనగరంలో అయితే పాత తరపు రజాకర్ల పార్టీలు ఇంకా ఆ ప్రాంతాలను ఏలుతున్నాయి. ఒక అభివృద్ది వుండదు. అసెంబ్లీలో వారినుంచి ఒక్క ప్రశ్న వుండదు. ఎవరూ ఏ తనిఖీకి పాతనగరం వెళ్ళలేరు. వెళ్తే వస్తారో రారో చెప్పలేం. ఇలా వుంది పరిస్థితి. దీనిని సరి చెయ్యటానికి ఏ పెద్ద పార్టీ కూడా ప్రయత్నించదు. ఎందుకంటే మైనారిటీలు రాజకీయపరంగా చైతన్యం పొందితే వారికి చాలా ప్రమాదం. ప్రస్తుతానికి వారికి కావలిసింది మాస్ వోటింగు సరళి. అంటే ఏదో ఒక తెగ నాయకుడిని మంచి చేసుకుంతే, ఆ తెగ అందరూ ఆ పెద్ద చెప్పినట్లు వోట్ వెయ్యటం లాంటిదన్నమాట. ఆ రకంగానే మైనారిటీ వోట్లు ఈ రాజకీయ పార్టీలకు కావాలి. అంతే కానీ వారి అభివృద్ధి గానీ, విద్య గానీ అస్సలు పట్టదు.

పైన చెప్పిన జాడ్యాలన్ని తీవ్రవాద పార్టీలకు అచ్చంగా మన ప్రభుత్వం ఇచ్చిన వరాలు. ప్రస్తుతం పరిస్థితి ఎలా వుందంటే ఒక తీవ్రవాది దొరికితే వాడికి శిక్ష కూడా వోట్ల రాజకీయాల బట్టి అమలు చేస్తున్నారు.

ఈ మతం మత్తునుంచి దేశం ఎప్పుడు బయట పడుతుంది? తీవ్రవాది, దేశ ద్రోహి అన్నాక ఏ మతమైనా ఒకటే. మతాన్ని దానికి జోడించి ప్రకటనలు ఎందుకు చేస్తారో అర్ధం కాదు. ఇది ఇలానే జరిగుతూ పోతే మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు దేశ భావ స్రవంతి నుంచి క్రమంగా దూరమైపోతారు. తమ దేశంలోనే పరాయిగా బతుకుతారు.

ఎంతకాలం ఇలా మనం స్వీయమోసం చేసుకుంటాం? ఒక జాతి, ఒక జాతి అని లక్ష సార్లు అరిచేకంటే, ఒక్క జాతిగా బతికి చూపితే మంచిదేమో?  

Thursday, August 30, 2007

కంప్యూటర్ ఎరా తెలుగు వెలుగులు...

కంప్యూటర్ ఎరా తెలుగు సాంకేతిక పత్రిక "వెబ్ లో తెలుగు వెలుగులు" పతాక శీర్షికతో ఇప్పుడు లభ్యం. అన్ని విషయాలను (ఏదీ వదల లేదేమో బహుశా) అంత నేర్పుగా కూరి కూరి అద్భుతంగా వండి పడేసిన ఘనత మాత్రం జ్యోతి గారిదే. అన్ని పేజీలకు తమ అమూల్యమైన పత్రిక పుటలను కేటాయించిన పెద్ద మనసు మన నల్లమోతు శ్రీధర్ గారిదే...వారిద్దరికి మనసారా ధన్యవాదాలు. నిన్న రాత్రి నేను నా ప్రతి కొనుక్కున్నా...పదిహేను రూపాయలలో మీకు పది రోజులకు సరిపడా చదువుకునేందుకు అందులో విషయాలు వున్నాయి. మరెందుకిక ఆలస్యం...మీ ప్రతి కొనుక్కునేందుకు బయల్దేరండి. లేదా సంవత్సర చందాదారులుగా చేరండి. మన అమ్మా నాన్నలకు కంప్యూటర్ నేర్పాలంటే ఇంతకంటే మంచి పుస్తకం దొరకదు.

Monday, August 27, 2007

మా వైద్యుడు...అప్పిచ్చువాడు...నగరం

 అప్పిచ్చువాడు....వైద్యుడు వున్న వూరిలో వుండాలని పెద్దలెపుడో చెప్పారు.

అలానే అనుకుని పాపం అమాయక ప్రజలు నమ్మారు...

కోకొల్లలుగా వూరిలో మకాం పెట్టేసారు...

వూరిని నగరంగా మార్చేసారు....

నగరంగా మారిన వూరు కూడా ఒళ్లు విరుచుకుని గర్వపడింది....దాని రాబడి కూడా పెరిగింది.

దాంతో నగరం పక్కదారులు పట్టింది.

ఇక వైద్యుడు తన అసలు పని మానేసి రాజకీయాలలో ఆరితేరాడు..

ప్రజలు తనను నమ్ముకున్నారనే విషయాన్ని పూర్తిగా మర్చాడు.

క్రమంగా అందరూ రాజకీయులే ఆ నగరానికి అన్ని దిక్కులయ్యారు...

ఏడీ వైద్యుడు కనిపించడే....అలా అని ఉన్న వూరిమీద మమకారం ప్రజలను వదలదే...

ఆ మమకారంతో ప్రజలు నగరాన్ని వదలటం లేదు...

అప్పిచ్చువాడు..అప్పు ఇస్తూనే నగరాన్ని దోచుకోవటం మొదలుపెట్టాడు...కుటుంబాలు చితికిపోయాయి

నగరానికి పట్టిన రోగంలో మాడి మసయిపోయిన ప్రజలను పట్టించుకునే వైద్యుడు ఎలాను లేడు...ఇంకేముంది నగరంలో కొల్లొలుగా రాబందులు తయారయ్యాయి.

శవాలపైన ఎగరుతూ వారి బంధువులను ఓదార్చడమే పనిగా పెట్టుకున్నాయి.

వైద్యుడు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు....ప్రస్తుతం వైద్యం మానేసి పోష్టుమార్టమే చెయ్యటం మొదలెట్టాడు

ఇప్పుడు అతడు ఎవరు ఎందుకు చనిపోయారో మాత్రమే చెప్పగలడు...అతికష్టం మీద...

రక్షించు మహాప్రభో అంటే...ఎక్కడో దేహంలో దాడి జరిగితే నా కళ్లకు ఎలా కనిపిస్తుంది అని అమాయకంగా అడుగుతాడు..

నేను వైద్యం చెయ్యలేనందుకు .... నీకు ఎక్స్ గ్రేషియా ఇస్తానంటాడు.

ప్రజలు పైన పెద్దలు చెప్పిన పద్యాన్ని మరొకసారి చదువుకున్నారు.

ఏమీ తోచలేదు...ఎక్కడకు పోవాలో సమఝవ్వలేదు...

మన బతుకింతే అని పద్యాన్ని మార్చి రాసేసుకున్నారు...

పిల్లలకూ అదే నేర్పారు...

అమ్మా, నాన్నలతో వుంటే అన్నింటి కంటే సురక్షితమనుకునే పిల్లలకు ఇవి అర్ధం కాలేదు.

వారు పెద్దయ్యాక కూడా ఇంకా వారు పాత పద్యాన్నే నమ్మసాగారు...

నగరం మాత్రం నవ్వుతూ తన శరీరాన్ని అమ్ముకుంటూ పెంచుకుంటూనే వుంది.

దానికిప్పుడు ఈ రోగాలు పెద్దగా పట్టవు...వైద్యుడి అవసరం అంతకన్నా లేదు....

Saturday, August 25, 2007

ఇదేనా భాగ్య నగరం ?

దాదాపు నలభై మంది వరకూ మృతి. వంద మందికి పైగా క్షతగాత్రులు...

బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం, ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ..ఇవీ ఈ నగర ప్రజల వినే ప్రభుత్వపు చివరి పలుకులు.

బహుశా వారి పని కావచ్చు...బహుశా వీరి పని కావచ్చు..ఇవి పోలిసుల అరిగిపోయిన రికార్డులు...

ఇది పిరికిపందల చర్య ...పనికి రాని కేంద్రం..

ఛీ మనదీ ఒక సమాజమేనా? ఇక్కడ ప్రాణాలకు విలువ ఐదు లక్షలా? అన్ని రకాల ఇంటలిజెన్స్ నివేదికలూ పోలీసులను ముందుగానే హెచ్చరిస్తాయి..గానీ అక్కడ వినటానికి నిజమైన పోలీస్ వుంటేగా...ప్రతీ ఒక్కడు ఎన్నెన్ని లక్షలు పోసి ఇక్కడకు పోస్టింగులు చెయ్యించుకుంటారో చెత్తనా వెధవలు....అందరూ వాళ్లే వుంటే ఇక నిజమైన పోలీసులు ఎక్కడ? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ప్రభుత్వానికి ఎప్పుడు పడుతుంది?

పేలుడు తరువాతి దృశ్యాలు చూస్తుంటే అసలు మన దేశంలో క్రైమ్ సీన్ అనే దానికి అర్ధం వుందా? అనిపించింది. శవాల మధ్యన తిరుగుతున్న పది పదిహేను జతల కాళ్ళు...ఏ క్లూ ఎవడి కాళ్ల క్రింద నలిగిపోతుందో అర్ధం కాదు. ఒక పోలీస్ సెక్యూరిటీ లైన్ అంతకంటే లేదు.

అంబులెన్సులు గంట తరువాత వచ్చాయి....మరి ఎలా రాగలవు? మనది అద్భుతమైన ట్రాఫిక్ కదా? ఎలా వస్తాయి?

సీ.యన్.యన్ ఐబి యన్ ఒక్క ముక్కలో మన నగర పరిస్థితి చెప్పింది.... హైదరాబాదుకు సెక్యూరిటి కల్చర్ లేదు.

అవును ఒప్పుకోవాల్సిందే...అస్సలు లేదు.

తమకు సంబంధించని వైషమ్యాలలో, తమకు తెలియని సమాజం జరిపిన దాడిలో, తమకు తెలిసేలోపే అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకున్న మన  సమాజ పౌరులకు సిగ్గుతో తలవంచుకుని శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.

Friday, August 24, 2007

మన రాజధానికే ఇవి సొంతం....పోటీయే లేదు

మన భాగ్యనగరానికే సొంతం అయిన అవలక్షణాలలో ఆణిముత్యాల లాంటి నాలుగు అవలక్షణాలను నేను ఈ మధ్య సరదాగా నా సెల్ ఫోన్ తో క్లిక్కు మనిపించా...వీటిలో కొన్ని ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి, ఇంకా చాలా మంది సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతూనే వున్నాయి. అయినా "నాకేంటంటా? అహ...నాకేమిటంట?" అనే రకంగా వున్న ప్రభుత్వ వ్యవస్థ పిల్లి నిద్ర పోతూనే వుంది.

౦౧. మహానగరపు అమీర్ పేట సార్వత్రిక విశ్వవిద్యాలయం జడల మర్రి

బ్యానరు కడతారు....కొద్ది రోజులలో కొత్త కోర్సు వస్తుంది....బ్యానరు విప్పరు...తెంపుతారు...కొత్తది కడతారు. ఇలా తాళి మీద తాళి ఈ స్థంభానికి కడుతూనే వుంటారు. ఎప్పుడు ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి.

౦౨. ప్రత్యక్ష నరక ప్రాయమైన ట్రాఫిక్

 ప్రపంచంలోనే అతి విచిత్రమైన ట్రాఫిక్. రోడ్లు విశాలంగా వుంటే ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. వున్నా వారికి సగానికి పైగా రూల్స్ తెలియవు. వారికి తెలిసి ఎవరిని ఆపినా ఎవరూ ఆగరు...పారిపోతారు. అడ్డంగా కట్టి పడేసిన మసీదులు, గుడులు, సమాధులు ఈ నరక ప్రగతికి సోపానాలు.

౦౩. కబ్జా కింగుల కనక సింహాసనం

ఎక్కడ చెరువుంటే, సముద్రముంటే అక్కడ నాగరికతా, ప్రకృతి వెల్లివిరుస్తాయి. ఇక్కడ మాత్రం డంపింగు విరిసి కురుస్తుంది. ఆనక ఆ చెరువుని మెల్లగా కప్పేస్తుంది. కబ్జా చేస్తుంది.

౦౪. అధికారుల ధన దురాశాపరత్వం : గ్రేటర్ మెగా యాడ్ సిటీ

మీరు ఒక గంట రోడ్డు మధ్య కదలకుండా నిల్చుంటే, మీ వీపు భాగాన్ని బల్దియా జాలిమ్ లోషన్ వారికి యాడ్ అతికించుకోవటానికి అద్దెకిచ్చేస్తుంది. నగరమంతటా యాడ్లే. ఫుట్ ఓవర్ వంతెనలు కూడా వదలరు. చెట్లు నాటితే ఏమొస్తుంది నా బొంద...యాడ్లు నాటుదాం రండి. రాత్రింబవళ్ళు విద్యుత్తు సరఫరా కూడా వుంటుంది. యాడు వున్నా లేకున్నా సరే...

Thursday, August 23, 2007

శ్వేత భారతీయ సౌందర్యం

ఈ మధ్య నేను నిశితంగా గమనిస్తున్నవి వివిధ రకాల ప్రకటనలు. నాకీ అలవాటు అమూల్ ప్రకటనల పట్ల ఇష్టంతో మొదలయ్యింది. అమూల్ ప్రకటనలు అత్యంత భారతీయంగా చూడగానే నవ్వొచ్చే సమకాలీన అంశాలను పేరడీ చేస్తూ చాలా బాగుంటాయి. అలా మొదలయ్యిన ఇష్టం అమెరికాలో ప్రకటనలు చూసాకా ఇంకా ఎక్కువయింది. అయితే ఈ మధ్య మన దేశంలో వస్తున్న టీవీ, హోర్డింగుల ప్రకటనలు చూస్తే చాలా బాధగా వుంది. అసలు ఈ ప్రకటనలపై ఒక సెన్సారు బోర్డు వుందా లేదో నాకు తెలియదు కానీ...వుంటే బాగుండునేమో అనిపిస్తుంది. కొన్ని యాడ్లు ఆగి చూస్తే గానీ అర్ధం కావు. మరికొన్ని కొన్ని వర్గాలను తీవ్రంగా అవమానిస్తు వుంటాయి. జాగ్రత్తగా అలోచిస్తే గానీ అవి అర్ధం కావు.

ముఖ్యంగా ఫెయిర్నెస్ క్రీముల ప్రకటనలు. ఈ ప్రకటనలు ఎంతకు తెగిస్తున్నాయంటే నలుపు అనేది అందవికారానికి చిహ్నం అని నూరిపోసేంతగా.. ఒక క్రీము కంపనీ ఒక నల్లని అమ్మాయిని చూపించి...ఆమెని మైకేల్ జాక్సన్ తెలుపుకు క్రమంగా తెచ్చి "అందమే ఆత్మ విశ్వాసం" అని డప్పు కొడుతుంది. ఫెయిర్ నెస్ అంటే "తెలుపు" రంగనుకునే బ్రిటీష్ కాలపు బానిసత్వం నుంచి ఎప్పుడు బయటపడతాం?

ఇంకొక క్రీము కంపనీ...మగవాళ్లు ఆడవారి క్రీమ్ వాడటమా అని హేళన చెయ్యటం. స్త్రీల మీద వారి వుద్దేశ్యమేంటో అర్ధం కాదు. అసలు ఈ క్రీముల వలన చర్మంలోని మెలనిన్ శాతాన్ని తగ్గించగలం అని ఇప్పటివరకూ ఎవడు ఇతమిధ్ధంగా నిరూపించలేకపోయారు. ఈ మధ్య ఒక సర్వే ప్రకారం తెలిసిందేంటి అంటే ఆసియన్లకు తెలుపు మీద వెర్రి ప్రేమ అని, అదే అమెరికన్ తెగలకు కాంతివంతమైన చర్మం మీద అధికమని. ఈ కారణం మీద అన్ని ప్రకటనలు ఇప్పుడు "తెలుపు" మంత్రాన్ని "అందానికి" అందలంగా చూపిస్తున్నాయి, డబ్బులు పిండుకుంటున్నాయి. మన దేశంలో ఈ దరిద్రమైన  ఆర్యన్ దేహ "అందపు" నిర్వచనానికి బలం చేకూర్చే ఎటువంటి పనినైనా ప్రభుత్వం సెన్సారు చెయ్యాల్సిన పని వుంది. లేకపోతే ఇప్పటికే తెల్లవాళ్లకు అమ్ముడు పోయిన ఆత్మ గౌరవపు చివరి ఎంగిలి మెతుకుల్ని కూడా "తెలుపు" రంగు పేరిట చాలా మంది కోల్పోయి అందుకు నల్లగా పుట్టాన్రా బాబు అని బాధపడుతూనే వుంటారు.

Thursday, August 16, 2007

గూగుల్ తెలుగు ఆన్ లైన్ కీ బోర్డు

ప్రస్తుతానికి ఇది చాలా సాదాగా వుంది. ఐగూగుల్ మాడ్యూల్ గానే లభ్యం అవుతుంది. దిగువ చూపిన లంకె నుంచి దీనిని మీరు మీ గూగుల్ హోమ్ పేజీకి జత చెయ్యవచ్చు.

Indic On-Screen Keyboard iGoogle Gadgets

Tuesday, August 14, 2007

నోకియా బాంబులు...మీ దగ్గరా వున్నాయా?

నోకియా బ్యాటరీల పేలుడు వార్తలు విన్నారా?

మీరు గనక క్రింద ఇవ్వబడిన మోడల్ నోకియా మొబైల్ ఫోన్ వాడుతున్నట్టయితే వెంటనే ఒక్క సారి మీ బ్యాటరీ మోడల్ చూడండి.

Nokia 1100, Nokia 1100c, Nokia 1101, Nokia 1108, Nokia 1110, Nokia 1112, Nokia 1255, Nokia 1315, Nokia 1600, Nokia 2112, Nokia 2118, Nokia 2255, Nokia 2272, Nokia 2275, Nokia 2300, Nokia 2300c, Nokia 2310, Nokia 2355, Nokia 2600, Nokia 2610, Nokia 2610b, Nokia 2626, Nokia 3100, Nokia 3105, Nokia 3120, Nokia 3125, Nokia 6030, Nokia 6085, Nokia 6086, Nokia 6108, Nokia 6175i, Nokia 6178i, Nokia 6230, Nokia 6230i, Nokia 6270, Nokia 6600, Nokia 6620, Nokia 6630, Nokia 6631, Nokia 6670, Nokia 6680, Nokia 6681, Nokia 6682, Nokia 6820, Nokia 6822, Nokia 7610, Nokia N70, Nokia N71, Nokia N72, Nokia N91, Nokia E50, Nokia E60

అది బీ యల్ - ఐదు సీ (BL-5C) అయితే కనుక వెంటనే ఇక్కడ చూపిన విధంగా మీ బ్యాటరీ సీరియల్ నంబరుతో ఒక్క సారి సరి చూడండి.

మీ బ్యాటరీ కనుక పేలే సంభావ్యత వున్నట్టుగా తేలితే, దగ్గరలో వున్న నోకియా షోరూం (హైదరాబాదులో అయితే సోమాజిగుడ) దర్శించితే మీకు కొత్త బ్యాటరీ లభిస్తుంది.

మొబైల్ వంక భయంగా చూడటం మాని, తొందరగా కొత్త బ్యాటరీ తెచ్చుకోండి మరి...

Sunday, August 12, 2007

నా బ్లాగ్నిశ్సబ్ధం

దాదాపు నెల తరువాత మరలా నా బ్లాగు ప్రపంచంలోనికి అడుగుపెట్టాను. (హడావిడిలో రాసిన క్రింది టపాను మినహాయించితే) గత నెల రోజులుగా నేను ఎందుకు ఒక్క టపా కూడా రాయలేకపోయానంటే అందుకు పెద్దగా కారణాలు కనిపించటంలేదు :-) పని ఒత్తిడి కొద్దిగా పెరిగింది. బహుశా సియాటిల్ లో స్నేహితులు నన్ను తెగ తిప్పి అన్నీ చూపించటం వలన వచ్చిన అలసటా కావచ్చు. నా బద్ధకం వలన ఎవరి వ్యాఖ్యలైనా వెంటనే అప్రూవ్ చెయ్యలేక పోయిండవచ్చు, తిరిగి నా అభిప్రాయాలు రాయలేక పోయి వుండవచ్చు. (కొంతమంది దీనిపై నన్ను విమర్శించారు కూడా...:-)). అందుకు నన్ను క్షమించ కోరుతున్నాను.

కానీ మరొక్క సారి నేను కొన్ని విషయాలు చెప్పదలచు కున్నాను.

01. ఈ బ్లాగు లో నేను రాసిన ఏ విషయమైనా పూర్తిగా నా భావం మాత్రమే. అది అందరికి నచ్చుతుందని గ్యారంటీ నేను ఇవ్వలేను. నా బ్లాగే కాదు ...ఏ బ్లాగు అది ఇవ్వదు.

02. ఇక నా బ్లాగులో వ్యాఖ్యానాలు అవి రాసిన వారి సొంతం. నాకు ఏ మాత్రము సంబంధమూ లేదు. అయితే పరస్పర దూషణలకు ఈ బ్లాగు వేదిక కాకుండా చిన్న జాగ్రత్త తీసుకునేందుకు "అనామిక" వ్యాఖ్యలను చాలా వరకు కత్తిరించదలచుకున్నాను. అలానే డిగ్నిటీ లేనివి కూడా...:-) నన్ను తిట్టాలంటే మీరు నాకు ఒక ఈలేఖ (సుధాకర్ @ జీ మెయిల్) రాసి పడెయ్యండి.

అదండీ సంగతి...

Sunday, July 08, 2007

ప్రపంచ వింతలు వంతులు పూర్తయ్యాయి

కొత్త ప్రపంచ వింతలు నిర్ణయించేసారు. వెబర్ అనే ఒక పిచ్చోడికి వచ్చిన అద్భుతమయిన హార్వార్డు వ్యాపార స్థాయి ఆలోచన జనాలతో, వారి సెంటిమెంట్లతో ఆడుకుని ఏడు ప్రపంచ వింతలను నిర్ణయించేసింది. అవి ఏడే ఎందుకు వుండాలని చాలా మందికి డౌటొచ్చింది., కానీ మన దేశంలో కానీ, మరెక్కడయినా కానీ మేధావులను డౌటొస్తేనే కదా ఏవడయినా పట్టించుకునేది? అందువలన ఆ డౌట్లు పెద్దగా ప్రభావితం చూపలేదు. యునెస్కో లాంటి సంస్థ కూడా చాలా ఖచ్చితంగా తెగేసి మరీ ఈ ప్రయోగాన్ని విమర్శించినా ఎవడూ పట్టించుకోలేదు.

మీరు కూడా ఈ వోటింగులో పాల్గొనివుంటే, వెంటనే ఒక సర్టిఫికెట్ ప్రింటు తీసుకోండి. ఎందుకంటే ప్రపంచంలోని అతి పెద్ద వింత స్కామ్ లో మీరు పాల్గొన్నారు కాబట్టి.

అతిపెద్ద వింత ఏమిటంటే, ఈ లెక్కల ప్రకారం, పిరమిడ్లు ఒక వింత కాదు. ఇదెలా వుందంటే కొంతమంది పిచ్చోల్లందరు కలసి చంద్రున్ని సూర్యుడిగా నిర్ణయించేసినట్లుంది. అసలు ప్రపంచంలో ఏ శాస్త్రం ప్రకారమైనా, నిర్మాణశైలిలో నయినా పిరమిడ్లకు సాటి రాగల వింత అసలు లేనే లేదు. ఇప్పడి సైంటిష్టులందరూ ఒక ఏభై సంవత్సరాలు కష్టపడినా వాటిని కట్టలేరు. నాకు తాజ్ కు వచ్చిన గుర్తింపువలన రావలసిన ఆనందం కన్నా, పిరమిడ్లకు లభించని గుర్తింపు తలచుకుంటే చాలా బాధగా వుంది. అలానే కంబోడియాలో అతి ప్రాచీనమయిన అంగకార్ వాట్ విష్ణు దేవాలయమూ లేదు. కంబోడియాలో ఇంటర్నెట్టు, మొబైల్ ప్రపంచం అంతగా లేదు మరి. అందువలన ఆ దేశం వింతలు వుండే ఆస్కారమే లేదు.

నేను ఈ పిచ్చి ప్రయోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీకు ఈ మాయ అర్ధమయితే ఖండించండి.

Saturday, June 30, 2007

తానా తందానా

తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ప్రయాణిస్తున్న దిశ చూస్తే నవ్వు వస్తుంది. ఇది కొన్నాళ్లకు ఎన్.ఆర్.ఐ పెట్టుబడుల సంఘంగా మారుతుందేమో అన్న సందేహమూ వస్తుంది. ఇప్పుడు అది అమెరికా రాజకీయాలలో దూరేంతవరకూ పోయింది. సోనియాను ఇటాలియన్ అని తిట్టే చంద్ర బాబు, తెలుగు జనాలు అమెరికా రాజకీయాలలోనికి దూరటాన్ని ఎలా సమర్ధిస్తాడో మరి. ప్రతి రాజకీయ ప్రతినిధి అమెరికా వెళ్లడం, అక్కడి వారిని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమనటం. పెట్టుబడులు తప్ప మరేమి చెయ్యలేరా వారు? సిలికానాంధ్ర లాంటి సంస్థలు ఎలాగు మన రాజకీయనాయకులకు పట్టవు.

హిల్లరీ క్లింటన్ ఎన్నికలకు ఒక మిలియన్ డాలర్లు తానా తరుపున ఇవ్వబోతున్నారంట. అంటే దాదాపు నలభై కోట్లు. ఆ డబ్బుతో ఎంత మంది తెలుగు రైతులకు విత్తనాలు కొనివ్వవచ్చు? ఎంతమంది వరద బాధితులను ఆదుకోవచ్చు? అసలు మన రాష్ట్రంలో వరదలు, తుఫాన్ సంగతి వారికి అసలు పట్టిందా? లేదా విడుదలవ్వబోయే చిరంజీవి సినిమాకు అమెరికా హక్కుల మీదే ఆలోచనా?

తెలుగు భాషగా కాక సంస్కృతిగా మారినందువలన, వారిని ఎవరూ తెలుగు వారు కాదనటం లేదు. కానీ కనీసం మిగిలన దేశాల కాలనీలు, వలస వెళ్లిన జనాల సంస్కృతి, మాతృ దేశం మీద ఆరాటం, సేవ తెలుసుకుంటే చాలు.

[కొసరు] : తలో గ్రామం దత్తత తీసుకోండి. - ప్రవాసాంధ్రులతో చంద్రబాబు (ఇక్కడ చూడండి)

ఏమి చెయ్యలేని రాజకీయనాయకుల్లా కాకుండా, కాస్త మానవ సేవ కూడా చూడండి అని చెప్పకనే చెప్పినట్లుంది. చంద్రబాబు చాలా గుణ పాఠాలు నేర్చుకున్నట్లుందే? క్రితం సారి పెట్టుబడులు అడిగినట్లు గుర్తు Tongue out

Friday, June 29, 2007

కొత్త ఆపిల్ మొబైల్ - విశేషాలు

ఇంకొన్ని గంటలలో ఆపిల్ తన సరికొత్త సమ్మోహనాస్త్రాన్ని ప్రపంచం మీద ప్రయోగించబోతోంది. ఐపాడ్ తో ఆపిల్ సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. దాదాపు మూసేస్తారేమో అనుకున్న ఆపిల్ కంపనీ ఊపిరి పీల్చుకుని నిలబడటానికి కారణం ఐపాడే. మానవ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగిన సంగీత ఉపకరణం ఐపాడ్ అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఐపాడ్ విజయంతో ఊపిరి పీల్చుకున్న ఆపిల్ ఇక మిగిలిన అవకాశాల వైపు దృష్టి సారించింది. ఐఫోన్ తో ఇప్పుడు ముందుకొచ్చింది. ఈ ఐఫోన్ మీద జరిగిన హడావిడి ఇంతా అంతా కాదు. ఈ మధ్య ఒక చిత్రానికి జరిగిన హంగామా స్థాయిలోనే ఇది కూడా జరిగింది.

ఈ రోజు సాయింత్రం ఆరు గంటలకు (పసిఫిక్ కాలమానం) విడుదలవ్వబోయే ఈ ఫోన్ కొనుక్కునేందుకు ఒక న్యూయార్క్ ఆపిల్ దుకాణం ముందర బారులు తీరిన జనాలను చూడండి. మనం అమెరికా వీసాలకు కాన్సులేట్ల ముందర ఒకానొక కాలంలో ఇలా ఎదురు చూసే వాళ్లం కదా? Hee hee.

చిత్రం : ఏ.బీ.సి సౌజన్యంతో

అయితే ముందర ఈ ఐఫోన్ వివరాలు,అది ఎలాంటి సేవలు అందిస్తుందో చూద్దాం...

స్టోరేజీ సామర్ధ్యం : 4 లేదా 8  గిగాబైట్ల ఫ్లాష్ డ్రైవ్
ఫోన్ బ్యాండ్ : జీ.యస్.యమ్ క్వాడ్ బాండ్
టాక్ సమయం : ఎనిమిది గంటలు
స్టాండ్ బై సమయం : రెండు వందల ఏభై గంటలు
ఇంటర్నెట్ సమయం : ఆరు గంటలు
వీడియో సమయం : ఏడు గంటలు
నిర్వహణ వ్యవస్థ : ఓ.యస్.ఎక్స్ (మాక్)|
కెమరా : 2 మెగా పిక్సెల్స్
వైర్లెస్ వ్యవస్థ : వై.ఫీ, ఎడ్జ్, బ్లూ టూత్
శబ్ధ వ్యవస్థ : AAC, MP3, AIFF, WAV
దృశ్య వ్యవస్థ : H.264, M4V, MOV

బరువు : 138 గ్రాములు

 

ఇది పాకెట్ పీసీ స్థాయిలో తయారు చేసిన వినూత్నమైన ఫోన్ లా కనిపిస్తుంది. చాలా తేలికగా, అందరికి అర్ధమయ్యే రీతిలో తయారు చేసిన అందమైన నిర్వహణ వ్యవస్థతో లభించనుంది. దీనిలో ఇప్పటి వరకు ఏ ఫోన్ లో లేని సేవలు ఏమీ పెద్దగా లేవు గానీ ఉన్న వాటినే చాలా ఆకర్షణీయంగా తయారు చేసింది ఆపిల్. ఇప్పటికే పాకెట్ పీసి తెగ వాడిన వారికి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. అయితే దీనిలో వున్న ఐపాడ్ ఈ పరికరానికే ఒక పెద్ద ఆకర్షణ.

ఈ ఫోన్ను, ఇప్పటికే చలామణిలో వున్న ప్రముఖ ఫోన్లతో పోల్చితే

ఇప్పటికి ఈ వివరాలు చాలనుకుంటా :-)

తరువాయి టపాలో అసలు ఐఫోన్ కు అంత సీన్ వుందా? లేదా అనేది రాస్తా...

Wednesday, June 20, 2007

మేరా రాష్ట్ర మహాన్ (నా రాష్ట్రం చాలా గొప్పది)

ఈ మధ్య రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే, ఎందుకురా బాబు పుట్టాం ఈ రాష్ట్రంలో పోయి పోయి అనిపిస్తుంది. భాషా ప్రాతిపదిక మీద ఒక రాష్ట్రం పుట్టినందుకు కోపమొస్తుంది. ఎక్కడి నుంచో ఒక తెల్లోడు వచ్చు నాలుగు వేల కోట్ల భూమి నాలుగు కోట్లకు ఇక్కడ కొనుక్కోవచ్చంట. ఇదే రాష్ట్రంలో పుట్టి పెరిగి, ఒకే భాష ఇంకో యాసలో మాట్లాడే వాడు మాత్రం నాలుగు వేల జీతానికి పనిచెయ్యకూడదు. ఈ ముష్టి జీవోలతో ఎవరి కడుపు కొడుతున్నారో అర్ధం అవ్వటం లేదు.

  • పిచ్చ పిచ్చగా డబ్బులు సంపాదించుకున్న భూస్వాములు
  • సినిమాలు చూపించి బెంజిలలో తిరుగుతున్న కులనట శేఖరులు (వీరిది నటకులం కాదు)
  • రెండెకరాలతో మొదలెట్టి రెండు వేల కోట్లతో రాజకీయాలు చేస్తున్న నాయకులు
  • రోడ్డు మీద రోడ్డు ప్రతి సంవత్సరం వేస్తున్న కాంట్రాక్టరులు

పైన పేర్కొన్న వారిలో ఒక్కడిని కూడా ఈ జీవో కనీసం ఈగ వాలినంత కూడా ముట్టుకోదు. మూటా ముల్లె సర్దుకుపోయే వాళ్లంతా కూడా మధ్యతరగతి బడుగు జీవులే. ఒక అయిదు శాతం పెద్ద అధికారులు వుంటారేమో. మొదటి విడతగా నాలుగు వందల మంది కానిష్టేబుల్లు పంప బడ్డారు. అసలు ఇక్కడ అర్ధం కానిదేమిటంటే అసలు మనం వున్నది ఎక్కడ? పాకిస్థాన్ లోనా? లేకా ఇంకేమైనా దేశమా? లండన్ లో వున్నమన డాక్టర్లను మాత్రం వారు ఇంటికి పంపబోతే మనకు ఎక్కడలేని ఎన్.ఆర్.ఐ ప్రేమ పుట్టుకొస్తుందే? అలాంటిది రెసిడెంట్స్ మీద ఎందుకీ కక్ష? ఈ కక్ష ద్వారా ఎవరి వోట్లు సాధిద్దామని?

దీనికి తోడు నోటికి హద్దులేని కె.సీ.ఆర్ వ్యాఖ్యలు…."లుంగీలు కట్టుకుని, చెప్పులు చేత పట్టుకొచ్చిన ఆంధ్రా వాళ్లు"…ఎవరీ ఆంధ్రా వాళ్లు? తెలంగాణాలో దాష్టీకం సాగించిన నవాబుల మోచేతి నీళ్లు తాగిన కె.సి.ఆర్ లాంటి దొరలైతే కానే కాదు. అప్పటికీ, ఇప్పటికీ తెలంగాణా పేదోల్లు మీలా బిర్యానీలు తింటూ, షాయరీలు చెప్పుకోలేదు, చెప్పుకోవటం లేదు. తాగుబోతు మాట్లాడే కె.సీ.ఆర్ కు తన వీధిలోని పేదోళ్ల సంగతి తెలుసా కనీసం? ఏమైనా ఛారిటీ నడుపుతున్నాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి ఏ అర్హత చూసుకుని, ఏ జ్ఞానంతో ఎవరిని ఆంధ్రా అని అంటున్నాడో, అసలు తెలంగాణ తప్పితే చుట్టుపక్కల వున్న రాష్ట్ర సంస్కృతి, ప్రాభవాలు అతనికి నిజంగా స్కూల్లో మాష్టారులు నేర్పలేదో మనకర్ధం కాదు.

కాకతీయుల అద్భుత సంస్కృతి చెప్పుకుంటే ఆంధ్రుడనేవాడికెవరికయినా ఒళ్ళు పులకరిస్తుంది. మరి మన ముక్కు బాబు గారికి నవాబులు, బిర్యానిలు దాటి మానసిక వికాసం లేకపోవటం చాలా చెత్తగా వుంది. వరంగల్ లో వేయి స్థంభాల గుడిని చూసి అప్పటి టూరిజం శాఖా మంత్రి రేణుకను మా మిత్ర బృందం తిట్టుకున్న సందర్భం ఇప్పటికీ గుర్తుంది. అంతవరకెందుకు ఈయన చంకలు గుద్దులునే నవాబులు కట్టించిన అద్భుత కట్టడం గోల్కొండ అతి దీన స్థితిలో వుంది.

ఇవనీ వదిలేస్తే…

ఈయన, ఇతని పులిరాజా (ఇప్పుడు శత్రువు) ఇద్దరూ జనాలని అక్రమంగా దుబాయి తరలించే కేసులలో నిందితులుగా నిలబడ్డారు. రెండు రోజులలో పులిరాజాని అరెష్టు చేస్తారని నమ్మబలికన ముక్కుబాబు గారు ఇప్పుడు కిమ్మనకుండా వున్నారెందుకో అర్ధం కాదు. ముక్కుబాబు ముఠా కధలన్నీ విప్పుతానన్న పులిరాజా ఇంకా గడ్డి ఎందుకు మేస్తుందో అసలు అర్దం కాదు. వీరిద్దరికి నాలుగు తగిలించి నిజాలను రప్పించకుండా అసలు పోలీసు కుక్కలేం చేస్తున్నాయో ఆ బ్రహ్మ దేవుడికి కూడా అర్ధం కాదు. రషీదే వీరి పేర్లు కాక ఎవరైనా సామాన్యుల పేర్లు చెప్పివుంటే వారి తాట ఈ పాటికి లేచి పోయి వుండేది.

అమాయక చలి చీమలు క్రూర సర్పాన్ని వాటి తలల మీదగా ఎక్కించుకుని రక్షణ కల్పిస్తున్నట్లు వుంది ఇప్పటి రాజకీయ ప్రజా ప్రతినిధుల హవా.

గమనిక : ఈ టపా నా వ్యక్తిగత ఆలోచనల నుంచి పుట్టింది కాబట్టి, అందులో కొన్నిఆలోచనలు, అభిప్రాయాలు అందరికీ నచ్చక పోవచ్చు.

అది వ్యాఖ్యల ద్వారా తెలుపగలరు. అంతకు మించి నాకు ఏ కుల,రాజకీయ పక్షాల మీద ప్రత్యేక సానుభూతి గాని, అభిమానం గానీ లేదని మనవి చేసుకుంటున్నాను. :-)

Tuesday, June 12, 2007

హైతెబ్లాస మొదటి వర్షాకాల సమావేశం శుభారంభం

భారత క్రికెట్ కోచ్ పేరు గురించి కూడా ఇంత టెన్షన్ లేదేమో...కానీ హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి వర్షాకాల సమావేశపు వివరాల గురించి మాత్రం తెగ వత్తిడి జరిగింది. కొందరు ఈ-మెయిల్లు, కొందరు SMSలు, మరికొందరు ఫోనులు చేసే సరికి, ఆ దెబ్బకి నాలో బధ్దకస్తుడు బుద్ధి తెచ్చుకుని ఇప్పటి వరకూ దానిని గుర్తున్నంత వరకూ రాసి బొమ్మలు చేర్చి వీవెన్ సహాయంతో ఈతెలుగు గోడ మీద పిడకలా వేసే సరికి ఈ సమయం (12:21 am) అయ్యింది.

హైతెబ్లాస/ఈతెలుగు సంఘం మొదటి వర్షాకాల సమావేశ విశేషాలు, అత్యంత గోప్యనీయంగా వుంచబడిన రెండు ఐ.యస్.ఐ రహస్యాలు తెలియాలంటే ...ఇక్కడ చదవండి.

ఈతెలుగు సైట్లో వ్యాఖ్యలు రాయలేక పోతే...వ్యాఖ్యలేవయినా వుంటే ఇక్కడ రాయండి.

Sunday, June 10, 2007

అమెరికాలో భారతీయ అనుభవం - కొసమెరుపు

మీరు ఈ మిగతా మూడు టపాలు చదివి వుంటేనే ఈ టపా చదవండి. :-)

ఈ సోది చదవని వారు ముందర ఇది చదవండి…

తరువాత ఓపికుంటే ఇది చదవండి…

అప్పటికీ నిద్ర రాకపోతే….ఈ టపా చదవండి.

పై మూడూ చదివితే (శభాష్) చచ్చినట్లు ఇది చదవాల్సిందేనని మనవి...ఇది సీరియల్ ముగింపు..ఎలా వదిలేస్తారు?
-------------
నా లగేజీ కోసం ఇక వేట మొదలయ్యింది. మొదటి రెండు రోజులు డెల్టా వాడికి ఫోన్ చేసి విసిగిపోయాను. ఇక మా పీ.యమ్ రంగంలోనికి దిగి వారిని చెడామడా తిట్టి మిలియన్ డాలర్ల నష్టపరిహారం వేస్తా అన్న తీరులో మాట్లాడితే చావు కబురు చల్లగా చెప్పారు. ముంబయిలో నా లగేజీని మోసుకున్న తరువాతి విమానం పారిస్ వచ్చేసరికి, అక్కడ ఒక దరిద్రపు సమ్మె మొదయిందంట. ఛార్లెస్ డీ గాల్ విమానాశ్రయం మొత్తం సమ్మెలోనికి దిగిందంట. అందువలన దాదాపు ఎనభయి వేల బ్యాగేజీ పీసులు సిబ్బంది లేక అలా పడివున్నాయని డెల్టా భామ చెప్పింది. మా పీయమ్ ని కొద్దిగా చల్లబరచటానికి ఏదో అమెరికన్ జోక్ పేల్చి తెగ నవ్వింది కానీ, మా బ్రిటీష్ పీయమ్ గాడు సీరియస్ గా ఫోన్ పెట్టేసి, నా వైపు, నా బట్టల వైపు చూసాడు. "అదీ సంగతి" అని జీవం లేని నవ్వు నవ్వాడు. నేను ఏడుపుని బలవంతంగా నవ్వుగా మార్చుకుంటూ అయితే ఇప్పుడేం చేద్దాం అన్నా. "పద షాపింగ్ కి....నేను కొంటా నీకు బట్టలు...కంపెనీనే డబ్బులిస్తుంది...కంగారు పడక" అని ఓదార్పు చెప్పాడు.

సాయింత్రం ఒక పెద్ద షాపింగ్ మాల్ కు తీసుకెళ్లాడు. అప్పడు నాకర్ధం అయ్యింది. ఇక్కడ చెడ్డీలు అమ్ముకున్నా కోటీశ్వరుడు కావచ్చని. భారీ ధరలు, తీరా చూస్తే మన దేశంలో దొరికే రకాలే అన్నీ కూడా...సగానికి పైగా జీన్స్ బ్రాండులకు అరవింద్ మిల్స్ నుంచే కాటన్ ముడి సరుకు. సగటు అమెరికన్ల మీద కొద్దిగా జాలి వేసింది. నేను ముందర కొద్దిగా ధరలు చూసి కంగారు పడి.."కొద్దిగా ధరలు అధికంగా వున్నాయి కదా" అన్నాను. "ఏం ఫర్వాలేదు..కంపనీ కొంటుంది కదా ..." అని భరోసా ఇచ్చాడు. దానితో ఇక నాకు చుట్టూ వున్న షాపులన్నీ మన పుట్ పాతులమీద షాపులలాగా కనిపించటం మొదలుపెట్టాయి :-)

నేను రెండు ప్యాంట్స్ , మూడు షర్టులు తీసుకున్నా,..ప్యాంట్లు గాప్ జీన్స్ అని గుర్తుంది కానీ, మిగిలినవి గుర్తులేదు. మొత్తం బిల్లు మూడొందల డాలర్ల వరకు అయ్యింది. హమ్మయ్య అనుకుని ఇక ఇంటికి బయలు దేరాం. మధ్యలో ఏవో పచారీలు కొనుక్కొని రూము చేరేసరికి....

డెల్టా వాడు ఒక వ్యాన్లో నా సామాను, ఆలస్యానికి పరిహారంగా ఒక క్షమాపణ పత్రం పట్టుకొచ్చి సిద్ధంగా వున్నాడు. నేను మా పీయమ్ వైపు చూసి చిన్నగా నవ్వా...వాడు నా వైపు చూసి నవ్వలేక నవ్వాడు. ఆ చూపుల్లో నీ సామాను వచ్చిందని ఆఫీస్ లో ఎవరికీ చెప్పకు ప్లీజ్ అన్న వేడుకోలు కనిపించింది.

మొత్తానికి కధ అలా సుఖాంతమయిందన్న మాట...

త్వరలో మళ్లీ అమెరికా వెళ్లవచ్చు, మరి ఆ మలి అనుభవాలు ఎలా వుంటాయో....(ఈ మధ్య మన భారతీయులను మొత్తం బట్టలూడదీసి చెక్ చేస్తున్నారంట...వార్నాయనో...)

Friday, June 01, 2007

పదివేల దర్శనం

2007 లో నా బ్లాగు సందర్శకుల సంఖ్య 10000 (10,670 ఈ రోజుకు) దాటిందని సభాముఖంగా తెలియచేస్తూ ఆ విధంగా ముందుకు పోతానని మీ అందరికి తెలియ జేసుకుంటున్నాను. :-)

Wednesday, May 30, 2007

తెలుగు వికీపీడియా శోధన

ఇప్పుడు దాదాపు అన్ని (ఐ.యి 7, ఫైర్ ఫాక్స్ 1.5, 2.0 మొదలైనవి) కొత్త బ్రౌజర్లు ఓపెన్ సెర్చ్ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాయి. అందువలన ఇక్కడ దిగువున మీకు కనిపిస్తున్నట్లుగా మనకు కావలసిన శోధనా పరికరాలను మీ బ్రౌజరుకు జత పరుచుకొనవచ్చు. నేను ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని మన తెవికీ యొక్క శోధనా యంత్రాన్ని జతపరిచేందుకు కావలసిన సరంజామా ఇక్కడ సిధ్ధం చేసాను. మీరు చెయ్యవలసినదల్లా మీ బ్రౌజరు బట్టి ఒక శోధనా పరికరాన్ని ఎంచుకుని "క్లిక్కు" చెయ్యటమే :-)

image    image

 

image

Click Here :  తెలుగు వికీపీడియా శోధన

శివాజీ వచ్చేస్తున్నాడు

అందరు తెలుగు నిర్మాతలను గజ గజ లాడిస్తున్న శివాజీ ట్రయలర్ ను సీ.యన్.యన్. ఐ.బి.యన్ తమ సైట్ లో పెట్టింది. అంచనాలు భారీగా వున్నాయి. చంద్రముఖి స్థాయిలో వుంటుందో లేదో మరి చూడాలి...

టక టకా..టక్నోరటి శోధన

ప్రముఖ బ్లాగు శోధనా యంత్రం అయిన టెక్నోరటి ఇప్పుడు కొత్త రూపును సంతరించుకుంది. అంతే కాక తన శోధనా యంత్రానికి పదును పెట్టింది కూడా…

మీరు http://s.technorati.com కు వెళ్లి చూస్తే, చాలా సీదా సాదాగా వున్న ఒక పుట ఇలా కనిపిస్తుంది.

technorati_1

technorati_2

శోధనా ఫలితాలు చూసారా? నిన్ననే రాసిన టపా కూడా ఫలితాలలో ప్రత్యక్షమయింది. కుడి వైపు వున్న ఫిల్టర్ (authority) ద్వారా మనం మనం వెతుకుతున్న పదం అతి ఎక్కువగా వాడినవి దొరకపుచ్చుకోవచ్చు.

తెలుగు సమాచార బ్లాగులు ఎక్కువవుతున్న ఈ రోజులలో ఇది చాలా మంచి పరిణామం అని చెప్పాలి

Tuesday, May 29, 2007

రండి రండి రండీ...దయ చేయండీ..తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ !

సాఫ్టు‍వేరు ఉద్యోగులను ఆకర్షించటానికి బహుళ జాతి కంపనీలు ఏమైనా చెయ్యగలవు. వారి ఉద్యోగపు మొదటి రోజుని చిరస్మరణీయంగా మార్చివేయనూ గలవు. బంగళూరు లోని ఒక పెద్ద కంపనీ వారి కొత్త ఉద్యోగులను ఎలా స్వాగతిస్తుందో చూడండి. బహుశా మీ కంపనీ అడ్మిన్ చూస్తే మంచిదేమో :-)

గమనిక : ఈ వీడియో "నువ్వొక గొట్టం" (యూట్యూబు) మీద వున్నది. ఈ వీడియోకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు.




ఈ వీడియో సౌజన్యం : కిరుబా శంకర్

అమెరికాలో భారతీయ అనుభవం - 3

ఇది నేను చాలా రోజులుగా రాయాలని అనుకుని నాలోని ప్రొక్రాష్టినేటరును జయించలేక వదిలేసిన టపా. గత కొద్ది రోజులుగా ఇది పూర్తి చెయ్యాలనుకున్నాను కానీ, ఈ రోజు సీ.బి. రావు గారి వ్యాఖ్య చూసి, హమ్మో ఈ టపాను గమనిస్తున్నవారు కనీసం ఒక్కరున్నారని కంగారేసి ఇప్పుడు రాస్తున్నాను.

ఈ సోది చదవని వారు ముందర ఇది చదవండి…

తరువాత ఓపికుంటే ఇది చదవండి…

అప్పటికీ నిద్ర రాకపోతే….ఈ టపా చదవండి.

న్యూయార్కు నుంచి సిన్ సినాటి వెళ్లే విమానం ఎలానో వెతుక్కుని తాపీగా కూర్చున్నానే గానీ "బాగా ఆలస్యం అయిందే" అని మనసులో కొద్దిగా పీకుతూనే వుంది ఎందుకంటే నన్ను రిసీవ్ చేసుకోవటానికి రావాల్సిన వ్యక్తి అసలు వేచి ఉంటాడో లేదో తెలియదు. మొత్తానికి ఆ దేశవాళీ విమానం మెల్లగా డల్లాస్-ఫోర్ట్ వర్త్ విమానాశ్రయంలో దిగేటప్పటికి రాత్రి పన్నెండు గంటలయ్యింది. డెల్టా వాళ్లకు నా బాగేజీ మిస్ అయిన సంగతి రిపోర్టు చేసి అటు ఇటు చూసాను. విమానాశ్రయం మొత్తం మీద ఒక పది మంది వుంటారేమో. అంత ఖాళీగా వుంది. దగ్గరలో వున్న ఫోన్ నుంచి మా పీ.యమ్ కు ఫోన్ చేద్దామంటే అన్ని ఫోన్లూ క్రెడిట్ కార్డుతో పని చేసేవే. కాసేపు తిట్టుకుని ఎవరైనా నా గురించి లాంజ్ లో వున్నారేమో అని వెతికా…ఒక్కడూ లేడూ. ఎందుకుంటారు? ఏడు గంటలకు రావాల్సిన విమానం పన్నెండుకు వస్తే.

ఇక బయటకు వెళ్లే దారి చూసుకుంటూ నడక ప్రారంభించాను. ఒక దగ్గర క్రిందకు పోతున్న ఎస్కలేటర్ కనిపించింది. సరే చూద్దాం అని క్రిందకు దిగితే అక్కడ ఒక గది, దానికి బయటకు పోయే తలుపు వున్నాయి. ఆ తలుపు తీసుకుని చూస్తే అది పార్కింగుకు పోయే భూగర్బ టన్నెల్ అని అనిపించింది. నర సంచారమే లేదు. అందులో రుయ్యి మని చప్పుడు చేస్తూ చలి గాలి. డల్లాస్ లో పగలు అదిరిపోయే ఎండ, రాత్రి ఇలా చలిగా వుంటుందని తరువాత రోజులలో నాకర్ధం అయింది. సరే ఇక వెనక్కు వద్దామని చూస్తే పైకి వెళ్లే ఎస్కలేటర్ లేదు. అది వన్ వే అన్న మాట. చచ్చి చెడి ఎస్కలేటర్ కు అడ్డం పడి పైకెక్కాను. కాసేపు నడిచాకా బయట అద్దాలు, వాటి వెనుక కొంత మంది మనుషులు కనబడి, అక్కడ ఒక ఎస్కలేటర్ పట్టుకుని క్రిందకు దిగాను.

దూరాన చిన్న టేబుల్ ఒకటి వేసుకుని ఒకమ్మాయి కూర్చుని కనిపించింది. ఆమె చుట్టు ఒక నలుగురు బ్లాక్స్ మాట్లాడుతూ కనిపించారు. మెల్లగా వెళ్లి నా విషయం చెప్పాను. అడ్రెస్ వుందా? అనడిగింది ఆమె. ఉందని చెప్పాక, నేను ఇండియా నుంచి వచ్చానని అర్ధం చేసుకుని "మొహమ్మద్" అని అరిచింది. ఒక గోల్డెన్ కాబ్ వచ్చి ఆగింది. అతను మీ దేశమే, నిన్ను దిగపెడతాడు అని చెప్పి ఆ టాక్సీ ఎక్కించింది.

ఇక టాక్సీలో సంభాషణ భలే నడిచింది. పరిచయాలు అయ్యాక ఆ డ్రయివర్ ఒక పాకిస్తానీ అని తెలిసింది. మనకు చిన్నప్పటి నుంచి పాలతో పాటూ పాకిస్తాన్ అంటే ద్వేషం నేర్పించేస్తారు కాబట్టి, నాకు కొద్దిగా భయం వేసింది. అయితే అతడు చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఆ భయం పోగొట్టాడు. మధ్యలో కాఫీ తాగిస్తానని బలవంతం చేసినా, డల్లాస్ అంత మంచి పేరున్న వూరు కాదు కాబట్టి సున్నితంగా తిరస్కరించాను. ఈలోగా రాజకీయాలు మాట్లాడటం మొదలు పెట్టి ఇండియా, పాక్ రాజకీయనాయకులను చెడా మడా తిట్టాడు. కొద్ది సేపటి తరువాత నా అడ్రస్ తీసుకుని ఒక మాప్ తీసి దానిని గుర్తించాడు. అయితే నా ఆఫీస్ వాళ్లు నాకు పొరపాటున తప్పు అడ్రస్ ఇచ్చారు. Colby Street, 2026 అని ఇవ్వబోయి Colby Street 24 అని ఇచ్చారు. కాసేపు రకరకాల ఫోన్లు చేసి మొత్తానికి ఆ వీధిని పట్టేసాడు. ఇక చూడాలి మా పాట్లు. అక్కడ అన్నీ బంగళాలే. మా దగ్గరున్న నెంబరు ఎక్కడా లేదు. ఇలా కాదని అతని ఫోన్ నుంచి నా పీ.యమ్ కు ఒక కాల్ చేసాం. మా పీ.యమ్ పేరు సైమన్ జాన్సన్. అతడు బ్ర్టిటీష్ జాతీయుడు. జనరల్ డయ్యర్ కు స్వయాన ముని ముని ముని మనవడు. అచ్చమైన బ్రిటీష్ యాసలో మాట్లాడే వాడు. ఇక కాల్ ఎత్తిన తరువాత నేను మాట్లాడి డ్రయవర్ కు దారి చెప్పమని మొబైల్ డ్రయవర్ కు ఇచ్చాను. అతను మాట్లాడే ఇంగ్లీష్ నా డ్రయవర్ కు ఒక్క ముక్క అర్ధం కాలేదు. యస్, యస్, యస్..ఓఖే అని పెట్టేసి ఇక తిట్లు మొదలు పెట్టాడు బ్రిటీష్ వాళ్లని. రెండు మూడు రౌండ్లు తిరిగి మొత్తానికి బంగళాని పట్టుకున్నాం. అప్పుడు జరిగింది నేను మరచిపోలేని సంఘటన…మా కోసం చూస్తున్న మా పీ.యమ్ నైట్ గౌన్ వేసుకుని బయట ఎదురు చూస్తున్నాడు. కారు ఆగగానే దగ్గరకి వచ్చి…తలుపు తెరచి నేను దిగటానికి సాయం చేసాడు..

పాకిస్తానీ డ్రయవర్, భారత పాసింజర్….డయ్యర్ వంశంలోని ఒక బ్రిటిష్ వ్యక్తి తలుపు తీసి పట్టుకోవటం ..అంతా మాయలా అనిపించింది.

సాఫ్టువేరు మాతా ! నీకు  వందనాలు అనుకున్నాను :-)

స్వతహాగా ఎంతో మంచివాడైన సైమన్ తరువాత చాలా ఫీలయ్యి విమానాశ్రయంలో ఎవరూ లేనందుకు క్షమాపణ చెప్పాడు.

అదండీ నా మొదటి అమెరికా అనుభవం.

హలో…నిద్రపోయారా?

Monday, May 28, 2007

గుర్తుకొస్తున్నాయీ...గుర్తుకొస్తున్నాయి...

నా జీవితంలో అతి మధురంగా, అలా అలా గడచిపోయిన రోజులు నా చిన్న నాటి రోజులు, పీ.జీ చదువుతున్న రోజులు. అవన్నీ ఒక్క సారి గుర్తుకొస్తే ఛ ! ఏం హైదరాబాదు బ్రతుకురా బాబు అనిపిస్తుంది. ఇక్కడ నా స్నేహితులు కొంత మంది ఒక్క సారి కూడా పొలం గానీ, పల్లెటూరు గానీ చూడలేదంటే నమ్ముతారా? వారి బాల్యం నుంచి పట్టణపు వాసమే. వారికి నా బాల్యం ఒక సినిమాలా చెప్పే ఛాన్సు దక్కినందుకు కొద్దిగా అప్పుడప్పుడూ సరదాగా వుంటుంది. ప్రతీ విద్యార్ధి అసలు ఒక్క సంవత్సరమైనా పల్లెలో గడపాలనే స్కూల్ల్లు వస్తే ఎంత బాగుంటుందో? పల్లె చెప్పే పాఠాలు, కబుర్లు పట్టణం చచ్చినా చెప్పలేదేమో కదా?

మా నాన్నగారు ఉద్యోగరీత్యా ప్రతీ మూడేళ్లకు బదిలీల మీద ఊర్లు మారుతుండేవారు. ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి పోయి చదవటమే మన పని. అది ఎంత చిన్న పల్లె అయినా సరే. అలా మొట్టమొదటి సారిగా మారిన వూరు "వజ్రపుకొత్తూరు". అది ఒక ఉద్దానం పల్లె. ఉద్దానం అంటే ఉత్తర కోస్తాలో తీర ప్రాంతం అన్న మాట. ఆ వూరు ఒక మోస్తరు పల్లె. మండల కార్యాలయం, హైస్కూలు ఉన్న పల్లె అన్న మాట. ఊరికి ఒక వైపంతా సముద్రం. కాలుష్యం అంటే తెలియని తీరప్రాంతం వుంటుంది. ఊరి నుంచి ఒక రెండు కిలో మీటర్ల దూరంలో సముద్రం వుండటం వలన రాత్రంతా సముద్ర ఘోష మంద్ర స్థాయిలో వినిపిస్తూనే వుంటుంది. సముద్ర తీరానికి వెళ్లాలంటే మనం రకరకాల తోటలు (కొబ్బరి, జీడి, సర్వీ) మధ్యలో నుంచి తూర్పు వైపు గుడ్డిగా నడిచెయ్యటమేనన్న మాట. ప్రతీ తోటకూ, తోటకూ మధ్యలో ఒక సన్నని ఎడ్ల బండి దారి వుండి, దారి మొత్తం రెండువైపులా మొగలి పొదలతో కప్పబడి వుంటుంది. అందువలన అక్కడొక దారి వుందని మనకి బాగా తెలిస్తే తప్ప కనపడదు. ఆ దారి కూడా మొత్తం మోకాలి లోతు సముద్రపు ఇసుకతో ఉంటుంది. ఎడ్ల బళ్లు జాగ్రత్తగా ముందరి బళ్లు ఏర్పరిచిన రెండు లోతైన గీతల మీదగానే పోతాయి. లేక పోతే ఎద్దులు లాగలేవు ఆ ఇసుకలో.

చిన్న వూరవటం వల్లన చాలా మందికి అక్కడ ఒకరికొకరు పేర్లతో సహా పరిచయం. అందులోనూ ఆ ప్రాంత ప్రజల ప్రేమ వర్ణనాతీతం. పెద్దగా బాదరాబందీలు లేని జీవితం, కాలుష్యం లేని తోటలు, ప్రవాసం (అండమాను దీవులు) వెళ్లిన కుటుంబ సభ్యులు. ఇవే వారి జీవితం. అంతర్లీనంగా నక్సలిజం కూడా వుంటుంది. మనకు కనిపించదు, కనపడనివ్వరు కూడా(అచ్చం సిందూరం సినిమాలానే). మనం ఏ తోటలో నుంచి వెళ్లినా ఆదరంగా పలకరిస్తారు. వీలైతే ఒక రెండు కొబ్బరి బోండాలు తాగమని బలవంతం చేస్తారు. అక్కడ జీడి పళ్లు ఎవరూ పెద్దగా తినరు. ఒక పెద్ద గోతిలో కుప్పలుగా ఎర్రని, తియ్యని జీడిపళ్లను పోస్తారు. అవి పశువులు తింటాయన్నమాట. మాకు జీడి పళ్లు కొనుక్కు తినటం అలవాటు కాబట్టి, అక్కడ అలా గోతిలో పారేస్తుంటే మనస్సు చివుక్కుమనేది. మనం ఆ పళ్లు తినే జీవులని తెలిసి మాకు దోరగా, ఎర్రగా వుండే జీడి పళ్లు ఇచ్చేవారనుకోండి. అక్కడ మనం ఎన్ని పళ్లయినా కోసుకు తినవచ్చు. జీడిపిక్కలు మాత్రం చెట్ల దగ్గరే పడెయ్యాలి. అది మాత్రం ఒక రూలు. దారికి రెండు వైపులా వుండే మొగిలి పొదలు చాలా గుబులు పుట్టిస్తాయి. ఎందుకంటే అవి పాములకు మంచి ఆవాసం. కాకపోతే మొగలి పువ్వుల సువాసన మాత్రం అద్భుతంగా వుంటుంది. ఆ పువ్వుల రేకులను అల్లి మరలా పువ్వులా చేసుకొని ధరిస్తారు. మొగలి పొదల మధ్యలో అక్కడక్కడా సీతాఫలం చెట్లు తప్పనిసరిగా వుంటాయి. నేను నా స్నేహితులతో సీతా ఫలం పళ్ల వేటకు తరచుగా వెళ్లేవాడిని. ఒక పది, పదిహేను పెద్ద పళ్లు దొరికాక, దగ్గరలో ఒక మొగలిపొద దగ్గరలో మాలో ధైర్యం కాస్త వున్నోడు ఒక గొయ్య తవ్వి అందుకో ఆ పళ్లను పోసి, ఇసుక పోసి కప్పి, పైన ఏదో కొండ గుర్తు పెట్టేవాడు. మరుచటి రోజు వచ్చేసరికి ఘుమఘుమ లాడే సీతాఫలం పళ్లు తయారుగా వుండేవి. స్కూలు ఇంటర్వల్ (సాయింత్రం) ఇవ్వగానే మేము ఈ ఫలాల స్నాక్స్ తినటానికి దగ్గరలో వున్న తోటల్లోనికి పరారయ్యేవాళ్లం.

ఒక రోజు ఇలాంటి ప్రయత్నంలో నేను ఒక పది నిమిషాలు వెనకబడ్డాను. కాకపోతే గొయ్య తవ్విన స్థలం తెలుసుకాబట్టి నడుస్తూ, పరిగెడుతూ ఆ తోట దారి (గోర్జి అంటారు) వెంబడి వెళుతున్నాను. ఒక దగ్గర దారి రెండుగా చీలివుంది. అంటే నా ఎదురుగా గంభీరంగా వున్న మొగలిపొదల గోడ వుంది. నేను మధ్యలో ఆగి ఎటువైపా అని చూస్తున్నాను. సాధారణంగానే మొగలి పొదలు కప్పేసిన దారికో పగలు కూడా సాయింత్రం లానే వుంటుంది. ఇక సాయింత్రాలు చెప్పాలా? నాకు కొద్దిగా జంకు మొదలయ్యింది. చుట్టుపక్కల ఎవరూ లేరు, చీమ చిటుక్కుమన్న శబ్ధమూ లేదు. వెనక్కు తిరుగుదామా అని ఆలోచిస్తున్న సమయంలో ఏదో శబ్ధం వినిపించింది. నాకు గుండె గొంతులోకి వచ్చింది. అటూ, ఇటూ పరికించా…ఎవరూ లేరు. నా ముందర ఏదో కదలిక అతి దగ్గరలో అయినట్లనిపించి అటు తిరిగా…ఎవరూ లేరు. నాకు చెమటలు పట్టేసాయి. అప్పటికి నా దెయ్యాల కధలు చాలా మంది చెప్పేవారు. నేనూ నమ్మేవాడిని కూడా. అందువలన నా మెదడు అటువైపు ఆలోచన మొదలుపెట్టడంతో నాలుక పిడచకట్టుకుపోయింది. అయితే అప్పుడు కనిపించింది నాకు, ఆ అలజడికి కారణం అయిన భూతం. అంతే ! నా మెదడు మొద్దుబారిపోయింది. సరిగ్గా నా ఎదురుగా, నాకు ఒక రెండు మీటర్ల దూరంలో మొగలి పొదల మధ్య పడగ విశాలంగా విప్పి చూస్తుంది ఒక త్రాచు పాము. ఒక్క సారిగా జరజరమని ప్రాకింది. అప్పుడు చూశాను దాని పొడవు. అంతే వెనక్కు తిరిగి పరుగు లంకించుకున్నాను. శనిగాడు ముందరికాళ్లతో తంతే గాడిద వెనక్కాల్ల దగ్గర పడ్డానన్నట్లు, పారిపోతున్నప్పుడే ఒక చెప్పు(హవాయి చెప్పులు) ఇసుకలో కూరుకుపోయింది. వెనక్కు గబుక్కున తిరిగాను కానీ, పాము వున్న వైపు చూసే ధైర్యం లేదు, అలా అని చెప్పును సరిగా పట్టుకోలేపోతున్నాను. మొత్తానికి రెండు చెప్పులూ మర్యాదగా చేత్తో పట్టుకుని డెకథ్లాన్ క్రీడాకారుడిగా ఇంటికి చేరిపోయి పక్క ఎక్కేసాను. ఆ రోజు తలచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది.

మరిన్ని మధుర జ్జాపకాలు తరువాత….

Thursday, May 24, 2007

నేను ఈ మధ్య చూడాలని ఎదురు చూస్తున్న/అనుకుంటున్న చిత్రాలు

pirates

 

౦౧. పైరేట్స్ ఆప్ కారిబ్బియన్ - ఎట్ వరల్డ్స్ ఎండ్ -- ఇది వరస చిత్రాలలో మూడవది. రెండవ భాగంలో కెప్టన్ జాక్ స్పారో (జానీ డెప్) క్రాకన్ చేత మింగబడటంతో అతనిని రక్షించటానికి కెప్టన్ బార్బోసా (మొదటి భాగంలో విలన్) నాయకత్వంలో ఎలిజబెత్ స్వాన్ (కీరా నైట్లీ), విల టర్నర్ (ఓర్లాండో బ్లూమ్) బయలు దేరటంతో ఈ కధ మొదలవుతుంది. ఇది కూడా రికార్డులు సృష్టిస్తుందని అంచనాలు వున్నాయి. ప్రపంచమంతా ఆంగ్ల దేశాలలో మే 25 న, మిగతా దేశాలలో మే 24 న విడుదల కానున్నది ఈ చిత్ర రాజం.

ఈ చిత్రంలో ఒకొక్క పాత్రలో నటులు ఎలా ఒదిగిపోయారంటే, మనకు వారి మిగతా చిత్రాలు చూస్తున్నా ఈ పాత్రలే గుర్తుకొస్తాయి.

౦౨. ష్రెక్ - 3

సరదాగా సాగి పోయే మంచి సినిమా ఇది. ప్రేమ, ఆత్మ గౌరవం ఎంత విలువైనవో తెలుపుతుంది.

shrek3

౦౩. హ్యారీ పాటర్ - ఆర్డర్ ఆఫ్ ది ఫీనిక్స్ -- ఇప్పటి వరకూ మొదటి మూడూ చాలా సార్లు చూసేసాను. తరువాతి చిత్రం కూడా అదే స్థాయిలో వుంటుందని ఆశ. ఇది జూలై పదమూడున రాబోతున్నది. ఇందులో నాకిష్టమైన పాత్ర హెర్మొయన్ గ్రేంజర్ (ఎమ్మా వాట్సన్) అనే చాలా తెలివితేటలు, అందం, మంచితనం వున్న అమ్మాయి. అసలు అన్ని చిత్రాలలో ఆమే హీరోనా అనిపిస్తుంది.

harry and friends

మీరూ వీలయితే వీటి ముందరి భాగాలు చూసి వీటి కోసం తయారుకండి.

Tuesday, May 22, 2007

బోడి నిర్దారణ కమిటీలు.. వాటి కార్యక్రమాలు

ఆంధ్రజ్యోతిలో ఈ వార్త చూడండి. కొంత మంది పని లేని వాళ్లు ప్రతీ విషయాన్ని పచ్చి వ్యతిరేకవాదంలో చూస్తు, బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారో చదవండి.

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2007/may/21new40

వారు పెట్టుకున్న కమిటీ పేరు "నిజ నిర్దారణ కమిటీ". అలాంటప్పుడు వారు తమ శక్తి యుక్తులను నిజాన్ని కనుక్కోవటంలో పెడితే మంచిది. అంతే గానీ ఇలా వ్యర్ధ ప్రసంగాలకు దిగి వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టనక్కరలేదు. ఇలాంటి మాటలు చాలా చెత్తగా సమాజం మీద ప్రభావం చూపిస్తాయి. టీ కొట్టులో హాయిగా చాయ్ తాగుతున్న ఇద్దరు ముస్లిం - హిందు మిత్రులు ఇది చదివి వాదించుకుని విడిపోయినా పోవచ్చు.

ఏ ముస్లిం అయినా మసీదులో బాంబు పెట్టుకోడు అని ఎలా నిర్ణయించేసారు ?. దానికేమైనా నిర్ద్గారణ వున్నదా? ఆ మాట కొస్తే ఏ నిజమైన ముస్లిం కూడా టెర్రరిజాన్ని పవిత్రయుద్ధంగా సమర్దించడు. తీవ్ర వాద ఇస్లామిక్ పార్టీలు చేస్తున్న మారణకాండను సమర్ధించడు. కానీ రక్తపాతాన్ని, దేశ స్థిరత్వాన్ని దెబ్బ తీయాలంటే తీవ్ర వాదులు ఎక్కడైనా పెడతారు బాంబులు. 9/11 దాడిలో చాలా మంది ముస్లింలు టవర్స్ లో ప్రాణాలు వదిలారు. అది ఏమైనా లాడెన్ కు తోచిందా?

ఇక ఇది చదవండి http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2007/may/21main8

ఛాందసవాదం ఎక్కువైతే మతాలతో సంభంధం లేదు. ఎవరైనా ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తారు. ఎలాంటి పనులైనా చేస్తారు.

ఇక హిందూ మతోన్మాదులు సంగతి. ఈ మధ్య వీరు కొద్దిగా ఎక్కువగానే తయారయ్యారు. కానీ ఒక తీవ్రవాద గుంపు స్థాయిలో ఎక్కడా తయారయ్యారా అనేది తేల్చాల్సివుంది. ఒక వేళ వీరే ఆ పని చేస్తే దొరికిన సిమ్ కార్డు నుంచి దుబాయి, మలేషియా ఎందుకు కాల్స్ వెళ్లాయో తేల్చాలి.

ఇదంతా వదిలేస్తే అనుమానిస్తున్న "షాహెద్ బిలాల్" ఏమీ ఐస్ ఫ్రూట్ తినే అమాయకుడు కాదు. చాలా మంచి పోలిస్ రికార్డులున్నాయి.

నిజ నిర్ధారణ కమిటీలు, తొక్కలో దివిటీలు అన్నీ నిజం మీద దృష్టి పెడితే మంచిది. లేకపోతే ప్రభుత్వాలకు మళ్లే వీరు కూడా అమాయక జనాలను తప్పు దోవ పట్టిస్తునే వుంటారు వారి మార్గంలో. అది సమాజానికి ప్రమాదకరం.

మొన్న సద్దాం ను ఎక్కాడికో ఎత్తేసారు. అఫ్జల్ కు వురి పడలేదు…ఏమవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు షాహెద్ బిలాల్. రేపు అమెరికా లాడెన్ పట్టుకుని చంపేస్తే ? అప్పుడూ లాడెన్ మీద కవితలు రాసేసి..అమెరికన్లే ట్విన్ టవర్స్ కూల్చేసి లాడెన్ మీద పడ్డారంటారేమో?

మొత్తానికి ఐటమ్ లాంటి జనాలు వున్నారు మనకు.

Saturday, May 19, 2007

జీ-తెలుగు లో స రి గ మ ప

మీరు జీ-తెలుగు లో స రి గ మ ప లిటిల్ స్టార్స్ చూస్తున్నారా? చూడకపోతే మీరు చాలా మిస్ అవుతున్నారు. అద్భుతమైన గళాలతో న్యాయ నిర్ణేతలనే పరవశింపచేస్తున్నారు ఆ చిన్నారులు. పాత మధురాలను మరలా సుశీల, లీల, జిక్కి కూడా ఇలానే పాడేరేమో అన్నంత మధురంగా పాడుతున్నారు.

జీ-తెలుగుకు ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం అందిస్తున్నారు.

పది పైసల పిట్టకు పదిరూపాయల మసాలా

ఇక్కడ పది పైసల పిట్ట ఏది? :- మున్నా అనే ఒక హింసాత్మక సినిమా (సినిమాలోపల, ప్రేక్షకుడి బుర్రలోనూ)

పది రూపాయల మసాల వండే ఏకైక TV చానల్ ఏదో ఒక చెప్పనవసరంలేదు.


అసలే తెలుగు సినిమా దౌర్భాగ్యంలో వుంటే ఇలా తెలుగు టీవీ ప్రసార వాహికలు నిర్మాణాత్మక విమర్శ చెయ్యటం అటుంచి, ఒక్కో సినిమాను పట్టుకుని దాని నిర్మాత నుంచి, లైట్ బాయ్ వరకు ఇంటర్వూలు చేసి వారి చేత "ఇదే నా జీవితంలో చేసిన అత్యద్భుత కత్తి కమాల్ ఇరగ సినిమా" అని చెప్పించటం. ఆ సినిమాని పేర్లు పడటం నుంచి విశ్లేషించి (ఏదో మేకింగ్ ఆఫ్ టైటానిక్ విత్ జేమ్స్ కామెరూన్ లా) ఊదరగొట్టెయ్యటం మరీ పెరిగింది.

అయినా ఈ మధ్య ఆ తొమ్మిది చానల్ కు ఏమీ ప్రసారం చెయ్యటానికి లేక గోల్లు గిల్లుకుంటుందని ఏపీ మీడియా కధనం.

Thursday, May 17, 2007

రామా? సేతువు కట్టావా? లేదా?

సేతుసముద్రం పై చర్చలు, నిరసనలు ఇప్పుడు వూపందుకున్నాయి. సేతు సముద్రం గురించి తరువాత చెప్తా గానీ, ఈ వివాదానికి కారణమైన రామ సేతు (ఆడమ్స్ బ్రిడ్జి) ని గూర్చి మాట్లాడుదాం.

రామ సేతు గురించి తెలియని వాడు భారతదేశంలో ఎవరూ వుండక పోవచ్చు, మతాలతో సంబంధం లేకుండా. మన పురాణాల ప్రకారం సీత ను రక్షించడానికి రాముడు, వానరసేన సహాయంతో లంకకు కట్టిన వారధి ఈ రామ సేతు. సముద్రంపై తేలే బండలతో కట్టినట్లు చెప్తారు కొంతమంది. ఏది ఏమైతేనేం రామాయణ కాలంలో (మూడు లక్షల సంవత్సరాల క్రితం) ఇది కట్టబడింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పాక్ జలసంధి అని పిలుస్తున్నారు.

ప్రస్తుతం మనకు ఇది ఉపగ్రహ చిత్రాల ద్వారా కనిపిస్తుంది. క్రింద చూపబడిన విధంగా…

raamasethu

నమ్మడానికి ఎంత బాగుందో అని పాడుకోవాలనిపిస్తుంది కదా? :-) కానీ నాసా, మన పురావస్తు శాఖ వారితో చేసిన పరిశోధనల ప్రకారం ఈ సేతువు మానవమాత్రులెవరూ నిర్మించినది కాదని, అది కేవలం ఇసుక రాళ్ల సమూహం అని అర్ధం అయ్యింది. అది కూడా కేవలం మూడు వేల ఏళ్ల క్రితం మాత్రమే ఏర్పడినది అని కార్బన్ డేటింగు ద్వారా తేల్చారు.

నాసా అయితే ఏకంగా రామాయణ కాలంలో (మూడు లక్షల ఏభై వేల ఏళ్ల క్రితం) ఈ భూభాగం మీద మానవులు నివసించే ఆధారమేదీ లేదని కొట్టి పారేసారు. హిందు పత్రిక కూడా దీనికి ఆధారాలను ప్రచురించింది.  అయితే కొంత మంది శాస్త్రవేత్తలు సైతం రామ సేతు ప్రకృతి పరంగా ఏర్పడినది కాదని, దానిని ఎవరో నిర్మించి వుంటారని వాదిస్తున్నారు

ఈ బ్రిడ్జి దాదాపు నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం పాటు వ్యాపించి వుంది. కొన్ని చోట్ల అది సముద్ర తలానికి కేవలం మూడు నుంచి ముప్ఫై మీటర్ల లోతులో మాత్రమే వుంది. దీనివలన ఈ మార్గం గుండా భారీ నౌకలు ప్రయాణించలేవు. ప్రయాణించినా అతి ప్రమాదకరం కూడా. పదిహేనవ శతాబ్ధి వరకూ ఈ సేతువు పై నుంచి కాలి నడకన వెళ్లే విధంగా వుండేదంట. ఆ తరువాత వచ్చిన తుఫానులు, వాతావరణ మార్పులు ఈ మార్గాన్ని కాస్త లోతుగా మార్చివేసాయి.

అయితే ఇప్పుడు ఈ పాక్ జలసంధిని లోతు చెయ్యటం ద్వారా భారీ నౌకలను ఈ ప్ర్రాంతం ద్వారా నడిపించవచ్చని భారత ప్రభుత్వం ఆశ. తద్వారా అరేబియన్ సముద్రం నుంచి హిందు మహ సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలు శ్రీలంకను చుట్టి వెళ్లే బాధ తప్పుతుంది. భారత ప్రభుత్వానికి కూడా చేతినిండా డబ్బులు వస్తాయి. ఈ ప్రాజెక్టు పేరే సేతు సముద్రం ప్రాజెక్టు. దీని వలన దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అంచనా. అంటే దాదాపు ముప్ఫై గంటల ప్రయాణం తగ్గుతుంది.

అయితే ఈ ప్రాజెక్టు వలన ఆ ప్రాంతంలో వున్న పగడపు దీవులు (coral reefs) అన్ని పోతాయి. రామ సేతు పోతుంది. సునామీ వంటివి వస్తే దానిని కొంతవరకు ఆపేది ఈ రామ సేతు నే. ఇప్పుడు అది పోతే ధనుష్కోటిని బట్టలు విప్పి సముద్రపు వొడ్డున నిలబెట్టినట్లు అవుతుంది.

శాస్త్ర పరంగా దీని నిర్మాణాన్ని ఎదుర్కోవటం చాలా మంచిది. మంచి కన్నా చెడు జరిగే సూచనలు ఎక్కువున్నాయి. కానీ భా.జ.పా వంటి పార్టీలు రాముడికి ద్రోహం చేస్తున్నట్లు దీనిని ప్రచారం చేస్తూ ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది మొదటికే మోసం తెచ్చే ప్రమాదం వుంది. సెక్యులర్ భావాలను కాలరాసే పార్టీగా దానికి వున్న మచ్చనే ఆయుధంగా చేసుకుని వారు వాదన త్రోసిపుచ్చవచ్చు.

చంద్రబాబు ...చెణుకులు

ఈ రోజు టీవిలో మాట్లాడుతూ చంద్రబాబు భలే జోకాడు.

"ఎముకలు, పుర్రె, శవాలు వున్న బీడీలు ఎవరూ తాగరు...జ్ఞానం, ఇంగితం వున్నోడు ఎవ్వడూ అవి జేబులో పెట్టుకు తిరగడు".

ఆహా, అంటే అవి లేకుంటే, జేబులో పెట్టుకు తిరిగేవాడికి ఇంగితం వున్నట్లా? :-)

Friday, May 11, 2007

స్పయిడర్ మాన్ - మూడు, మన మూడు

ఒక స్నేహితుడు ఎక్కడో టోరెంట్లో సంపాదించిన స్పైడర్ మాన్ - 3 DivX మూవీ రాత్రి చూసాను....చూస్తూ మధ్యలో నిద్ర పోయాను. ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి నాకు చూసిన సినిమా ఏమీ గుర్తుకు రావటం లేదు...అదీ సంగతి. మన మూడు బాగుండాలంటే ఈ 3 చూడకపోవటమే మంచిది. 180 Rs టికెట్ + 100 Rs జంక్ తిండి మిగులుతాయి.

Wednesday, May 09, 2007

నేను ఒక కవిని....ఎందుకూ?

ఎప్పుడూ కిరణ్ చావా తో మాట్లాడినా నేను అడిగే ప్రశ్న ఒకటుంటుంది. అది అసలు ఈ కవిత్వం ఎలా చదువుతారండీ బాబు అని. అందులోనూ ఈ మధ్య తెలుగు బ్లాగులలో కవిత్వపు జోరు విజృంభిస్తున్నది కూడా..మరే భాషా బ్లాగులలో ఇంత కవిత్వపువేడి లేదేమో. ఏమైతేనేం మన తెలుగు వాళ్లు మంచి భావుకలని నిరూపిస్తున్నారు. అయితే నాక్కూడా ఈ రోజు కవిత్వం రాసేద్దామని "దుర్భుద్ది" పుట్టింది. :-) కాకపోతే అందరూ రాసినట్లు మంచి మంచి కవితలెందుకు రాయాలి…సరదాగా ఒక చెత్త కవిత రాద్దామనిపించింది. ప్రతీ ఒకడు ఈ కవిత చదవాలి (మీ లాగా). చదివి తిట్టుకోవాలి అని నా ఆశ…సి.నా.రే గళంలో చదువుకోండి.

 

నేను ఒక కవిని

ఎందుకో తెలుసా?

నేను కవిత్వం రాస్తా కాబట్టీ….

 

నేను కవిని కాక ముందు ఒక జీవిని

ఎందుకో తెలుసా? మీకు తెలుసా?

జీవం వున్నవాడిని కాబట్టీ….

 

ఈ కవిత నేను రాసాను

ఎందుకు రాసాను?

ఏ పనీ లేదు కనకా…

 

ఈ కవిత ఇప్పుడు చదవబడుతుంది

ఎందుకు చదవబడుతుందీ?

చదివుతున్న వ్యక్తికి అస్సలు పనిలేదు కనకా...

 

ఈ కవిత, నా కవిత

చెపుతుంది ఒక కత

చదివే వాడికి ఇది ఒక వెత

చెప్పేవాడికి చదివేవాడు మెతక

 

Sunday, May 06, 2007

మన అభాగ్యనగర్

మొన్న ఒక ప్రముఖ బ్లాగరుతో జీటాక్ లో మాట్లాడుతుంటే, విషయం ప్రమాదాల మీదకు, భద్రత మీదకు మళ్లింది. హైదరాబాదు ప్రస్తుతం అన్ని నగరాల కంటే అతి సుఖవంతమైన, భద్రత కలిగిన నగరం అని ఆ బ్లాగరు అంటే నాకు ఒక్క సారి మన నగర ముఖ చిత్రం కళ్ల ముందర గిర్రున తిరిగింది. అందువల్లన ఆ విషయ ముఖంగా నాకు తెలిసిన నాలుగు ముక్కలు, వార్తా పత్రికల ఆధారంగా ఒక చిన్న అవలోకనం.

హైదరాబాదు ప్రస్తుతానికి పౌర జీవన ప్రమాణాల సూచీలో చాలా తక్కువ స్థాయి కలిగివుందని నా అభిప్రాయం. ఎందుకో చూద్దాం.

పౌర జీవన ప్రమాణ సూచీ (Life Index) అనేది అనేక కారణాల మీద అధారపడి వుంటుంది. చక్కని పొందిక కలిగిన సమాజం, ఆరోగ్యకరమైన గాలి, నీరు, శుభ్రత, నాణ్యత కలిగిన సేవలు, ఆర్ధిక సమానతలు, పేదరికం అనే విషయాలు ముఖ్యమైనవి. అయితే ఇవి కాక మరికొన్ని కారణాలు కూడా ఈ సూచీ ని ప్రభావితం చేస్తాయి. అవి మానసిక ఆనందం, ప్రశాంతత, పర్యావరణం, సమాజ చైతన్యం వంటివి. అయితే ఇవన్నీ మన రాజధాని నగరంలో ఎలా వున్నాయి?

శాంతి భద్రతలు : అతి దీనావస్థలో వున్నవి ఇవే. పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలో తొమ్మిది కోట్ల చోరీ, అసలు ఇప్పటికి అంతు చిక్కని ఆంధ్రా బ్యాంకు చోరీ, పట్ట పగలు దోపిడీలు లాంటివి మచ్చుకు కొన్నొ. తీవ్ర కొరత వున్న పోలిస్ సిబ్బంది. వున్న కొద్ది మంది కూడా రకరకాల గడ్డి తిని, తినిపించి రాజధాని నగరంలో పోష్టింగులు వెయ్యించుకుని ఏదో కొంత వెనకాద్దామనుకునేవాళ్లే. కొన్ని పోలిస్ స్టేషన్ల యస్.ఐ, సీ.ఐ పోష్టులయితే దాదాపు నలభై లక్షలవరకూ పలుకుతున్నాయి. రోడ్డు మీద అన్యాయం జరిగితే పిలుద్దామంటే కనుచూపు మేరలో కనిపించని పోలీసులు ఇక్కడే వున్నారు. "పోలీస్ ను పిలుస్తా" అంటే…పిల్చుకో ఫో, వాళ్ల సెటిల్మెంట్ ఎప్పుడో అయిపోయిందనే మాటలు ఇక్కడ సర్వ సాధారణం.

అవసరం అయిన దానికంటే కనీసం అరవై శాతం మంది తక్కువున్న ట్రాఫిక్ పోలీసులు. అందులో కొంత మంది సరి అయిన ట్రైనింగు, అధికారం లేని హోమ్ గార్డులు. ఇక ట్రాఫిక్ గురించి మాట్లాడే ముందు ఈ నగరంలో ప్రమాదాల సంగతి చూద్దాం.

dangers

అంటే మిగతా రాష్ట్ర ప్రజలందరి కంటే, ఈ నగర పౌరుడికి రోడ్డు మీద ప్రమాదానికి గురి అయ్యే సంభావ్యత చాలా అధికంగా వుంది. బయటకు బండి వేసుకు వెళ్తే తిరిగి వస్తామో రామో తెలియదు. ఏ టిప్పర్ (ఇవి రాజధాని లోగో కింద పెట్టుకోవచ్చు) ఎటువైపు నుంచి వచ్చి గుద్దేస్తుందో తెలియదు. ఏ బీ.పి.వో కారు (వీటికి ప్రత్యేకంగా ఫార్ములా - 0 రేస్ పెట్టొచ్చు) మనల్ని రాసుకుంటూ పోతుందో తెలియని భయం. అసలు ఆ కార్లకు అన్ని సొట్టలు, గీతలు, మరకలు (ఇవి సర్వ సాధారణం) ఎలా వచ్చాయని మన పోలీస్ లకు ఒక ఆలోచన వచ్చి ఏడిస్తే కదా? రోడ్లన్ని తమవే అనుకుని తిరిగే ఆటోవారి ఆగడాలు ఇక చెప్పనక్కరలేదు. లెక్కకు మించిన ఆటోలు ఇక్కడ వున్నాయి. ఏదో సర్వే వారు హైదరాబాదులో ప్రతీ పన్నెండు మందికీ ఒక ఆటో వుందని తేల్చారు. నిజమో కాదో తెలియదు కానీ, అసలు కొత్త ఆటోలను ఈ ప్రభుత్వం ఆపుతున్నట్లు లేదు. ఒకొక్క ఆటోలో పది మంది ప్రయాణించటం (స్కూలు పిల్లలు కూడా) ఇక్కడ సర్వ సాధారణం. ఎవడో ఎప్పుడో చస్తే అప్పుడు హడావిడిగా ఒక ప్రకటన మాత్రం చేస్తారు, ఇకపై అది నిషిద్ధం, ఇది నిషిద్ధం అని. అది ఒక పది రోజులు అమలు. తర్వాత అందరూ మర్చిపోతారు. ఇద్దరు ముగ్గురు పిల్లల ప్రాణాలు పోతే గానీ క్రాస్ ఓవర్ బ్రిడ్జీలు కట్టారా? ఇక్కడ అన్నీ ప్రాణాలు పణంగా పెడితే గానీ జరగవా?

ఈ రోజు ఈనాడు వార్త చదివితే చాలు…శాంతి భద్రతలు మసి పూసిన మారేడు కాయని అర్ధం అవుతుంది.

ఇక క్రిమినల్స్ సంఖ్య చూస్తే గుండె గుభిల్లు మనే గణాంకాలు కనిపిస్తాయి. ఎక్కడెక్కడి కేసులకూ పుట్టినిల్లు మన వూరే. తాళాలు వేస్తే చాలు, కూరగాయలకు వెళ్లి వచ్చేలోపే ఇళ్ళు ఖాలీ చేసిన కేసులు కనిపిస్తాయి. డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి లెక్క చెయ్యని ముఠాలు ఇక్కడే తిరుగుతున్నాయి.

పర్యావరణం : మన నగరం ఇటీవలే దేశ రాజధానిని తోసి అత్యంత కాలుష్య నగరాల పట్టికలో నిలిచింది చల్లగా జలాశయాలలోనికి విషాన్ని వదిలేసే ఫ్యాక్టరీలు, అవి అస్సలు కనిపించని గుడ్డి పీ.సీ.బీ ఇక్కడ వున్నాయి. పత్రికలు విషయాలు బయట పెడితే కానీ పని చెయ్యని సంస్థ అది.

వందల సంఖ్యలో అక్రమ బోరు బావులు తవ్వి, ఆ నీటిని ట్యాంకర్ల లెక్కన అమ్మేస్తున్నారు. దీని వలన భూగర్బ జలాలు తీవ్ర స్థాయిలో పడి పోతున్నాయి. ఎక్కడో వున్న బాబ్లీనీరు రాక పోవటం కాదు, మన క్రింద పారుతున్న నీరు మనమే పోగొట్టుకుంటున్నాం. ఇది అస్సలు రాజకీయ పార్టీలకు, రాష్త్ట్ర సమితులకు బుర్రకు పొరపాటున కూడా అందని విషయం. ఇది ఇలానే జరిగితే రానున్న పదేళ్లలో హైదరాబాదు ఒక చెన్నయి లా మారుతుంది.

రోడ్ల పక్కన వున్న చెట్లను పెంచటం మాట తరువాయి. వాటిని చల్లగా నరికేస్తున్నారు, వాటి స్థానే యాడ్ బోర్డులు పుట్ట గొడుగుల్లా వస్తున్నయి.

వున్న వేల ఆటోలు అన్నీ కిరోసిన్ కల్తీ పెట్రోలును వాడుతున్నాయి. అలా అయితే డబ్బులు వెనకేసుకోవచ్చనే ఆశ. దీనివలన కాలుష్యం భూతంలా నగరాన్ని కమ్ముకుంటుంది.

సమాజం: అతి దరిద్రంగా వుంది. పక్కింటోల్లు ఎవడో కూడా తెలియని ఆపార్టుమెంట్లు వేలు వున్నాయి. మొహంలో నవ్వు కాదు సరికదా, పలకరింపు కూడా ఇక్కడ దొరకదు. అందరూ సీరియస్ గా అగ్ని మాపక సిబ్బందిలా రోడ్డు మీద హార్న్ కొట్టుకుంటూ వెళ్లిపోవటమే. ఆంబులెన్స్ లకే దారి దొరకడం లేదంటే ఇక ఇంకేముంది? ఇక్కడ గుండె పోటొస్తే దగ్గరలో వున్న గుడికి వెళ్లటమే మంచిది. కనీసం రోడ్డు మీద కన్ను మూయకుండా వుంటాం.

ప్రపంచ అతి లంచావతారాలన్నీ ఈ నగరంలోనే తిష్ట వేసాయి. MLA, MP, IPS, IAS ల నుంచి గుమాస్తాల వరకూ చెయ్య తడపనిదే పని జరగదు. అసలు ఇప్పుడు ఇక్కడ లంచం అనే దానికి అర్ధం లేదు. అది కూడా పనిలో ఒక భాగం.

తెలుగు వారు సహజంగా పాటించే గౌరవం ఇక్కడ మీకు దొరకదు. అతి నిర్దాక్షిణ్యమైన, కరుకైన సమాధానాలు, స్వార్ధం పొంగుతో కలసి వస్తుంటాయి. ఎంతో బిజీ నగరం అయినా ముంబయిలో కూడా ఇలాంటి ప్రజని చూడలేదు. ముంబయ్ ప్రజలు కష్టంలో ఆదుకునే తీరు చూస్తే ముచ్చటేస్తుంది.

ఇక ఈవ్ టీజింగు గురించి చెప్పనక్కరలేదు…చెప్పలేని సంఘటనలు, అసభ్య మూకలు లెక్కకు మిక్కిలిగా వున్నాయ్.

ఇక మిగతా భాగాలు వీలు చిక్కినపుడు రాస్తా….

Monday, April 23, 2007

శత చిత్ర టప టప చిటపట టప టపావళి

హమ్మయ్య చాన్నాళ్లకు కొన్ని నవయవ్వన చిత్ర రాజాలను క్లిక్కు మనిపించి నా చిత్ర బ్లాగు సెంచరీ పూర్తి చేసా :-) ఈ సందర్భంగా నా చిత్ర టపాలకు ప్రేరణనిచ్చిన గురు ద్రోణులెందరికో మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో మూడు కళ్లూ పంచుకున్న నా కెమెరాలకు (ముఖ్యంగా నా DSC - P72 కు) ఈ సంధర్భంగా నా కృతజ్ఞతలు.

ఈ మధ్య జత చేసిన మూడు చిత్రాలు రామోజీ చిత్ర ప్రపంచ వీధిలో అసలు కనిపించని అందాలను బంధించినవి.

కూల్ క్లిక్కుల కిక్కులకు ఇక్కడ నొక్కండి

Saturday, April 21, 2007

పెరటి దేవుడీ వెంకటేశ్వరుడు

అసలే వేసవి. ఆపై భయంకరమైన రద్దీ. దేవుడిపై భారం వేసి రోజుల తరబడి క్యూ కాంప్లెక్సులలో కాపురాలు గడిపే పరమ భక్తులు..ఆహా ఏమి విశేష అభిమానులునారయ్యా వెంకు బాబు నీకు :-)

మరి వీళ్లందరిని ఇలా పడిగాపులు కాయించి పెరట్లో నుంచి అమితాబు కుటుంబానికి పెరటి దేవుడివైపోయావే? ఇది న్యాయమా? అసలే వీ.ఐ.పీ విహారాలతో పోటెత్తి పోతున్న తిరుమలలో ఇదొక కొస మెరుపా? లేదా 'సిరి' ఉన్నవాడిదే వేంకటేశ్వరమా?

రేపు చి..ల.సౌ. ఐష్ బచ్చన్ గారు, తన నూతన భర్త చి. అభి తో నీ దర్శనానికి వచ్చి కేవలం గంట అంటే గంటలో అన్నీ ముగించుకుని విమానమెక్కి పోతారంట గదా? ఆహా దేశ అభివృద్ధితో పాటు నీ పూజారుల బుర్రలు కూడా ఏమి అభివృధ్ధి చెందుతున్నాయి స్వామీ ? అటు ముగ్గురు, ఇటు ముగ్గురు పూజారులు ఐషమ్మ చుట్టూ రేపు వుండక పోతే నన్నడుగు. పందెమా?

Wednesday, April 18, 2007

మొబైల్ ఫోన్ ను వెతికి పట్టుకోవటం ఎలా?

మీ గర్ల్ ఫ్రెండు గానీ, బాయ్ ఫ్రెండు గానీ "నేను ఆఫీసులో వున్నాను, పని మీద వున్నాను" లాంటి సాకులు చెప్తున్నట్లు మీకనిపిస్తే తక్షణం ఈ ఉపగ్రహ సాఫ్టువేర్ ద్వారా వారిని ఎక్కడున్నారో ఇట్టే పట్టెయ్యొచ్చు. కేవలం వారి మొబైల్ నంబరు ఇస్తే చాలు...వారి మొబైల్ సిగ్నల్ బట్టి ఏ ప్రాంతం (కూకట్ పల్లి, అమీర్ పేట లాంటివి) చెప్తుంది.

మొదటి నాలుగు సంఖ్యలు ఒక పెట్టెలో, మిగతావి మరొక పెట్టెలో వేసి సెర్చ్ నొక్కండిక.....

http://www.sat-gps-locate.com/

Thursday, April 12, 2007

పిల్లికి చెలగాటం…ఎలుకకి ప్రాణ సంకటం [కొసరుతో]

అంత అనుకున్నట్లే అయ్యింది. నేను ఎప్పుడు ఈ యూనిపోల్ జైంట్ హోర్డింగులు చూసినా ఒకటే అనుకుండే వాడిని. ఏదైనా తుఫాన్ వస్తే ఏంటబ్బా సంగతి అని. సరేలే చాలా బలమైనవి కాబోలు అనుకునే వాడిని. MCH వారి ధన దాహానికి మరొక ప్రాణం బలి అయ్యింది. ప్రతీ కిలోమీటరుకూ ఒక హోర్డింగు. పార్కుల మధ్యలో, ఆఖరుకు ఇళ్ల మధ్యలో కూడా…వై.యస్ ఇంటి ముందర అయితే మరీ దారుణం. మొత్తం హోర్డింగు రోడ్డు పైనే వుంటుంది. వీటికి సర్వ వేళలా విద్యుత్తు సరఫరా వుంటుంది. దాని పైన యాడ్ లేక పోయినా సరే….ఫలానా వారిని యాడ్ కోసం సంప్రదించండి అని రాత్రంతా వందల యూనిట్లు ఖర్చు చేస్తూనే వుంటారు.

అసలు ఎందుకు ఇవి పెరిగాయి? అని చూసుకుంటే MCH వారి ఆశ తప్ప మరోటి కనిపించదు.

రోడ్డు మధ్యలో చెట్లు వున్నాయో లేవో గానీ, చిన్న చిన్న విద్యుత్తు బోర్డులు వందలు, వేలు నగరమంతటా…ఒకే యాడ్ ను ఆ రోడ్డు మొత్తం చూపించటం వీటి ప్రత్యేకత. ఇవి తెల్లవారు ఝాము వరకూ వెలుగుతూనే వుంటాయి. విచిత్రంగా సైబర్ గేట్ వే దగ్గర అయితే ఇవి మాత్రమే వెలుగుతుంటాయి..వీధి దీపాలు వెలగవు. అదీ సంగతి.

ఇక హోర్డింగులు….ఒకొక్కటి ఇరవై టన్నుల బరువు. హోరిత్తేస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే. సీరియస్ గా నడుపుతున్న వాడికి హఠాత్తుగా ఆకర్షించే హోర్డింగులు ఎన్నో. ఒక్క మాదాపూర్ లోనే ఇవి దాదాపు పది వరకూ వున్నాయి. ప్రతీ నగరం పైన ఒక రకమైన వాయు వాతావరణం వుంటుంది. గాలి రకరకాల దిశలలో తిరుగుతూ వుంటుంది. పార్కులు, జలాశయాలు ఎక్కువ వుంటే ప్రజలకు మంచి గాలి అనుభూతి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ హోర్డింగులు దానిని కాల రాస్తున్నాయి. ఈ భారీ హోర్డింగులు మొత్తం నగర ఉపరితలంలో వుండే గాలిని అడ్డుకుని స్థంభింప చేస్తున్నాయి. ఈ కారణం వలన ముంబయి కొలాబా ప్రాంతంలో హోర్డింగులు నిషేధించారు. మన పాలకులకు అసలు బుర్రలు ఎప్పుడు పని చేస్తాయో ఇంక. దీనికి తోడు ప్రాణ నష్టం. ఇరవై టన్నుల హోర్డింగు పడితే? ఎలా వుంటుంది? నిన్ననే చూసాను. భీభత్సంగా వుంది ఆ ప్రాంతం. మూడు కార్లు నుజ్జు, కనీసం ఒక పది మంది చనిపోయే ప్రమాదం..అదృష్టవశాత్తు ఆ సమయంలో అంతగా ట్రాఫిక్ లేదు.

ఇప్పుడు కొత్తగా LCD హోర్డింగులు వస్తున్నాయి. ఇందులో ఏకంగా పాటలు, సినిమా యాడ్లు చూపిస్తున్నారు, అసలు డ్రైవింగ్ చెయ్యాలా, ఇవి చూడాలో తిక మక. చాలా మంది ఇప్పటికే సెల్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు, దానికి తోడు ఇప్పుడు ఇవి. ఎవడి ప్రాణాన్నో తీసుకుని గానీ వీటి వైపు చూడదు ప్రభుత్వం.

ఇక పాద చారుల వంతెనలు…బాగా కడుతున్నారు. అయితే…వాటిని హోర్డింగులు పెట్టుకోవటానికే కడుతున్నారేమో అనిపిస్తుంది. సింగపూర్ లా చేస్తాం అని వాగేటఫ్పుడు, కనీసం కొన్ని అయినా సింగపూర్ లా చెయ్యాలి కదా. సింగపూర్లో ఈ పాద చారుల వంతెనలు చాలా ఎక్కువ. అయితే వాటిని అందంగా పూల తీగెలతో అలంకిరిస్తారు. మనం వాటిపై కూడా ఫోటోలు దిగేంత అందంగా…మరి ఇక్కడా? అసలు ఆ వంతెన మీద ఒకరి మీద అత్యాచారం చేసినా బయటకు కనపడనంతటి భారీ హోర్డింగులతో మొత్తం వంతనలను కప్పేస్తున్నారు. ఎవరైనా సరే ఆ యాడ్ చూసుకుంటూ వెళ్లవలసిందేనన్న్న మాట.

ఇలా చెప్పుకుంటు పోతే టన్నుల కొద్ది మేధావి తనం బయటపడుతూనే వుంటుంది.

వారికది కాసులాట…మన ప్రాణాలకు సంకటం. నగరజీవి…నీ సగటు ఆయుష్షు ప్రతి రోజు లెక్క పెట్టుకోవాల్సిందే..

 

నిన్న చెప్పటం మరిచా…కొత్త రకం యాడ్‌ మార్కెటింగు కూడా వస్తోందిప్పుడు. అదేమిటంటే ఒక పెద్ద ట్రక్ వాహనం మీద భారీ హోర్డింగును వూరంతా తిప్పడం. అది కూడా మంచి ట్రాఫిక్ రద్దీ సమయాలలో. ఆ సమయంలో అయితే ఎక్కువ మంది చూస్తారు కదా…అదీ అవుడియా అన్నమాట.

కొస మెరుపు :

నిన్నటి ఈదురు గాలులకు చిరిగిపోయిన జైంట్ యాడ్ హోర్డింగుల ప్రకటనలను మొత్తం శుభ్రం చేశారు. ఇప్పుడు చాలా వాటికి కేవలం ఫ్రేములు మాత్రమే వున్నాయి. అయితే కళ్ళు జిగేల్మనిపించే విద్యుత్తు కాంతులు మాత్రం యధాతధం. ఈ భాధ్యతారాహిత్యం మీద ఎవరికి, ఎలా ఫిర్యాదు చెయ్యాలో కాస్త తెలిస్తే చెప్పండి దయ చేసి..

Wednesday, April 11, 2007

ప్రాణ సంకట బాదు

మన భాగ్యనగరంలో ఒక రోడ్డును దాటాలంటే సామాన్యమా? మన మీద నుంచైనా వాహనాన్ని పోనిస్తారేమో కానీ, ఆపే సమస్యే లేదు. ఇది చూడండి. తీసిన వ్యక్తి ఎవరో గానీ గుండె ధైర్యం మస్తుగా వున్నవాడు.

Saturday, April 07, 2007

మౌనమేలనోయి...ఈ మరపురాని రేయీ

గాత్రం : ఎస్.జానకి

చిత్రం : సాగరసంగమం

Thursday, April 05, 2007

ఆకాశం ఏనాటిదో...అనురాగం ఆనాటిది.

మనందరిని సుస్వర స్వర ఝరిలో ముంచి తేల్చడమే ఊపిరిగా బ్రతుకుతున్న మన జానకి పాటలలో కొన్ని వరుసగా ఇక్కడ వుంచడానికి ప్రయత్నిస్తా. 

Wednesday, April 04, 2007

మూడు వందల వీరులు

300. ఇది ఒక సినిమా పేరు. గత ఆదివారం ఈ సినిమా చూశాను. లక్షల మంది వున్న పర్షియన్ సైన్యాన్ని స్వేచ్చనే వూపిరిగా, వీరత్వాన్ని ఆభరణంగా ధరించే ఒక స్పార్టన్ రాజు (లియొనార్డైస్) మెరికల్లాంటి, మడమ తిప్పని మూడు వందల యోధులతో ఎలా ఎదుర్కున్నాడో చూపే చిత్రం ఇది. 480 BC లో జరిగిన థెర్మోపైలే యుద్ధ అధారంగా దీనిని నిర్మించారు.

అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ చిత్రంలో చూడదగ్గది. గ్లాడియేటర్ చిత్రాన్ని కొన్ని చోట్ల గుర్తుకు తెస్తుంది. అరే రస్సెల్ క్రో ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించాల్సింది అని అనిపించింది కాసేపు.

దర్శకుడు గంటన్నర పాటూ అసలు సుత్తి అనేదే కొట్టకుండా ప్రేక్షకులను ఆ యుగంలోనికి తీసుకు పోయాడు.

క్సెరెక్సెస్ అనే పర్షియన్ రాజు వేషధారణ కూడా చాలా విచిత్రంగా వుంటుంది. దీనిపై ఇరాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

అయితే చిన్న పిల్లలను మాత్రం ఈ సినిమా చూడనివ్వక పోవటం మంచిది. రక్తం ఏరులై పారటం, శవాలు గుట్టలై పడటం అతియోశక్తులు అసలే కావు ఈ చిత్రంలో…అసలు శవాలతో ఒక గోడనే కట్టే సీను కూడా ఉంది.

స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వుంటాయి. సాంకేతికంగా "ఇరగ దీసారు" :-) యుద్ధ సన్నివేశాలు అయితే చెప్పనక్కరలేదు. లక్షల మంది వచ్చి పడినా సడలని ధైర్యం, యుద్ధ నైపుణ్యం చూపించడంలో చాలా శ్రద్ధ చూపించారు.

ప్రేమ, స్వేచ్చ, రాజ కర్తవ్యం, నాయకత్వ పటిమ, ధీరత్వం వంటివి ఈ చిత్రం తాలుకా కధా వస్తువులు.

2007 ఆస్కార్ పందెంలో పాల్గొనే ధైర్యం నిండుగా వున్న చిత్రం ఇది.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name