Thursday, August 03, 2006

ఇంకా చంపకండి ప్లీజ్.

ఈ రోజు ఈనాడులో హుడా వారి ప్రకటన (5వ పేజీలో) చూసి నవ్వాలో, ఏడవాలో అర్ధం కాలేదు.ఒక ప్రభుత్వరంగ సంస్థ, ఇంత బజారు ప్రకటన చెయ్యటం అవసరమా అనిపిస్తోంది. సమాచార హక్కు కింద మీరు 10 రూపాయలు ఎన్ని సార్లు చలాన కట్టి అడిగినా రాని సమాచారం, ఈ భావోద్వేగాలతో ప్రచురించటం ఏంటో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే అర్ధం కావాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే జవాబుదారీ కావాలి తప్ప, ఏ అధిక సర్కులేషన్ వున్న పత్రికకో కాదు. ఈ ప్రకటనకు నాకు అంచనా ప్రకారం ఒక 3 లక్షలు అవుతుంది(ఒక పత్రికకి).ఎవడబ్బ సొమ్మని ఈ ప్రకటనలు ఇస్తున్నారు? హుడా అంత ఉద్వేగానికి గురి కావల్సిన పని ఏముంది. అయితే వారి ప్రకటనలో ఒక వాస్తవం మనకు కనిపిస్తుంది. మన 5వ స్తంభం(మీడీయా) కూడా కుళ్ళిపోయింది. అది ఈనాడు కానియండి,వార్త లేకా టివి9 కానీయండి. నాకు ఈ విషయాలలో ప్రత్యక్ష అనుభవాలు వున్నాయి. అందుకే కొంతమంది విలేఖరులను చూస్తే లాగి కొట్ట బుద్ధి అవుతుంది.

రాజకీయ నాయకులకు, పత్రికలకు, బ్యూరాక్రాట్లకు ...చేతులు జోడించి ఇదే విన్నపం...చచ్చిన ప్రజాస్వామ్యన్ని, సోషలిజాన్నీ ఇంకా చంపకండి ప్లీజ్.

0 comments:

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name